Maruti Suzuki: కార్ సర్వీసింగ్ సెంటర్ల సంఖ్యను మరింత పెంచిన మారుతి సుజుకి
భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ, తన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ నెట్వర్క్ను రికార్డు స్థాయిలో విస్తరించింది. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 502 కొత్త సర్వీస్ టచ్పాయింట్లను ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. ఒకే ఏడాదిలో ఇంత భారీగా నెట్వర్క్ను విస్తరించడం కంపెనీ చరిత్రలోనే ఇది తొలిసారి. దీంతో మారుతీ మొత్తం సర్వీస్ కేంద్రాల సంఖ్య 3,000 నగరాలు, పట్టణాల్లో 5,926కు చేరుకుంది.
ఈ విస్తరణలో భాగంగా మెట్రో నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకు వినియోగదారులకు సేవలు అందించేలా అరెనా (ARENA), నెక్సా (NEXA) వర్క్షాప్లు, మారుతీ సుజుకీ సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్లు (MSSPs), సర్వీస్-ఆన్-వీల్స్ వంటి వివిధ ఫార్మాట్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. "వినియోగదారులు వర్క్షాప్కు రావాలనుకున్నా, డోర్స్టెప్ సర్వీస్ కోరుకున్నా, లేదా రోడ్ ట్రిప్ సమయంలో సహాయం అవసరమైనా.. మారుతీ సర్వీస్ కేంద్రం వారికి అందుబాటులో ఉంటుంది" అని తెలిపారు. 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి తమ నెట్వర్క్ను సుమారు 8,000 టచ్పాయింట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.
కంపెనీ తన మొదటి సర్వీస్ వర్క్షాప్ను 1983లో ప్రారంభించగా, 1,000 కేంద్రాల మార్కును చేరుకోవడానికి సుమారు 14 ఏళ్లు పట్టింది. కాగా, మార్చి నెలలో కంపెనీ రిటైల్ అమ్మకాల్లో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చిలో 1,92,984 యూనిట్లు అమ్మగా, ఈ ఏడాది మార్చిలో 2,25,251 యూనిట్లను విక్రయించింది. గురువారం నాడు బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేరు విలువ 1 శాతం పెరిగి రూ. 12,632 వద్ద ముగిసింది.
ఈ విస్తరణలో భాగంగా మెట్రో నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకు వినియోగదారులకు సేవలు అందించేలా అరెనా (ARENA), నెక్సా (NEXA) వర్క్షాప్లు, మారుతీ సుజుకీ సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్లు (MSSPs), సర్వీస్-ఆన్-వీల్స్ వంటి వివిధ ఫార్మాట్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. "వినియోగదారులు వర్క్షాప్కు రావాలనుకున్నా, డోర్స్టెప్ సర్వీస్ కోరుకున్నా, లేదా రోడ్ ట్రిప్ సమయంలో సహాయం అవసరమైనా.. మారుతీ సర్వీస్ కేంద్రం వారికి అందుబాటులో ఉంటుంది" అని తెలిపారు. 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి తమ నెట్వర్క్ను సుమారు 8,000 టచ్పాయింట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.
కంపెనీ తన మొదటి సర్వీస్ వర్క్షాప్ను 1983లో ప్రారంభించగా, 1,000 కేంద్రాల మార్కును చేరుకోవడానికి సుమారు 14 ఏళ్లు పట్టింది. కాగా, మార్చి నెలలో కంపెనీ రిటైల్ అమ్మకాల్లో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చిలో 1,92,984 యూనిట్లు అమ్మగా, ఈ ఏడాది మార్చిలో 2,25,251 యూనిట్లను విక్రయించింది. గురువారం నాడు బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేరు విలువ 1 శాతం పెరిగి రూ. 12,632 వద్ద ముగిసింది.