Narendra Modi: ట్రంప్ ఫోన్ చేశారు.. శాంతి దిశగా చేపట్టే చర్యలకు భారత్ సహకరిస్తుందని చెప్పాను: మోదీ ట్వీట్

Narendra Modi says Trump called India supports peace efforts
షార్ట్స్‌లో చూడండి
హర్మూజ్ జలసంధిని తెరిచి సురక్షితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఫోన్ చేసి సంభాషించినట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఉపయోగకరమైన రీతిలో తమ మధ్య చర్చ జరిగిందని తెలిపారు. ఈ అంశంపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు.

వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుందని ట్రంప్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, రక్షణ కల్పించడం ప్రపంచ దేశాలకు అత్యవసరమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. శాంతి, సుస్థిరం దిశగా చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 24 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి, ట్రంప్ నిన్న తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌తో తదుపరి చర్చల ఫలితాలను బట్టి నిర్ణయం ఉంటుందని అన్నారు. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ కాల్ చేయడం గమనార్హం.
Go Back to Shorts
Narendra Modi
Donald Trump
India
Hormuz Strait
West Asia
Iran
Israel
US
peace
de-escalation

More Telugu News