Chandrababu Naidu: మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం: సీఎం చంద్రబాబు
ఏపీలో ప్రతిష్ఠాత్మకమైన ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శంకస్థాపన జరగడం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు నేడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉత్తరాంధ్ర భవిష్యత్కు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఓ దిక్సూచి అని అభివర్ణించారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ సాధ్యమైందంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
"మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతీ రంగంలో, ప్రతీ ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశాం. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో... నేడు అభివృద్ది, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్లా ఆనందాన్ని, భవిష్యత్ పై భరోసాను తీసుకువచ్చాం.
ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే... ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్కు నూతన దిక్సూచి అవుతుంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు అవుతున్న ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రాగా మారుస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది.
గౌరవ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లనే 21 నెలల్లో ఇంత పెద్ద ప్లాంట్ను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. ప్లాంట్కు అవసరమైన ముడి ఖనిజం సరఫరా నుంచి అనుమతుల వరకు కేంద్రం వేగవంతమైన, సానుకూల నిర్ణయాలతో ప్రతి దశలోనూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. డబుల్ ఇంజన్ సర్కారు ప్రగతిశీల నిర్ణయాల వల్లనే ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మితమవుతోంది. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వచ్చే మూడేళ్లలోనే ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో, అన్ని విధాలా అభివృద్ది ఫలాలు అందుతాయి. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్కు అడుగులు పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు" అంటూ సీఎం చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
"మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతీ రంగంలో, ప్రతీ ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశాం. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో... నేడు అభివృద్ది, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్లా ఆనందాన్ని, భవిష్యత్ పై భరోసాను తీసుకువచ్చాం.
ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే... ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్కు నూతన దిక్సూచి అవుతుంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు అవుతున్న ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రాగా మారుస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది.
గౌరవ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లనే 21 నెలల్లో ఇంత పెద్ద ప్లాంట్ను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. ప్లాంట్కు అవసరమైన ముడి ఖనిజం సరఫరా నుంచి అనుమతుల వరకు కేంద్రం వేగవంతమైన, సానుకూల నిర్ణయాలతో ప్రతి దశలోనూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. డబుల్ ఇంజన్ సర్కారు ప్రగతిశీల నిర్ణయాల వల్లనే ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మితమవుతోంది. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వచ్చే మూడేళ్లలోనే ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో, అన్ని విధాలా అభివృద్ది ఫలాలు అందుతాయి. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్కు అడుగులు పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు" అంటూ సీఎం చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.