Chandrababu Naidu: అమరావతిలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర? రాయపూడి ఘటనపై సీఎం చంద్రబాబు హైలెవల్ రివ్యూ!

Chandrababu Naidu reviews Rayapudi fire incident conspiracy angle
షార్ట్స్‌లో చూడండి

రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న తరుణంలో, వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. నిన్న రాత్రి రాయపూడిలోని హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ ప్రాంతంలో మేఘా సంస్థకు చెందిన భారీ ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇది కేవలం ప్రమాదమా లేక ఎవరైనా కావాలని చేస్తున్న కుట్రనా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.


సీఎం చంద్రబాబు వ్యక్తం చేసిన ప్రధాన సందేహాలు:

రాజధాని ప్రాంతంలో గత కొద్ది రోజులుగా మూడు సార్లు ఇలాంటి ప్రమాదాలు జరగడం యాదృచ్ఛికం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. వివిధ కాంట్రాక్టు సంస్థలకు చెందిన కోట్లాది రూపాయల విలువైన నిర్మాణ సామగ్రి కాలిపోవడం వెనుక ఏదైనా లోతైన కుట్ర ఉందేమో తేల్చాలని చెప్పారు. వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద కూడా గతంలో ఇలాగే పైపులు అగ్నికి ఆహుతయ్యాయని, ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు మూడు జరిగాయని, ఇది ఉద్దేశపూర్వక చర్యగా కనిపిస్తోందని అధికారులు ప్రాథమిక సమాచారం అందించారు.


ఈ రోజు సాయంత్రం సీఆర్డీఏ అధికారులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాజధాని ప్రాంతంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసేలా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.


రాయపూడిలో అసలేం జరిగింది?

అఖిల భారత సర్వీస్ అధికారుల (IAS/IPS) కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాల సమీపంలో నిల్వ ఉంచిన భారీ పైపులు ఒక్కసారిగా తగులబడ్డాయి. ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడిన మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati fire accident
Rayapudi fire
Andhra Pradesh capital
CRDA
Megha Engineering
HOD towers
Conspiracy investigation
IAS IPS residences
Vegalapudi seed axis road

More Telugu News