ఆర్డీటీ సేవలపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ పూర్తి
- యథావిధిగా కొనసాగనున్న ఆర్డీటీ సేవలు
- కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అడ్డంకులు తొలగించామన్న మంత్రి లోకేశ్
- ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
ఆర్డీటీ సేవలు నిలిచిపోవని గతంలోనే మాట ఇచ్చానని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం, నిరుపేద పిల్లల చదువు, ఉపాధి, వైద్యం వంటి రంగాల్లో ఆర్డీటీ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు వివరించినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, దీంతో ఆర్డీటీ రెన్యువల్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే దశాబ్దాలుగా సేవా స్ఫూర్తితో పనిచేస్తున్న ఆర్డీటీ నిర్వాహకులు మాంచో ఫెర్రర్కు అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.