Bilal Arif Sarafi: పాక్లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబ సభ్యులపైనే అనుమానం!
పాకిస్థాన్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. లష్కరే తోయిబా సంస్థకు చెందిన కీలక కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, ఈ హత్య వెనుక అతని కుటుంబ సభ్యులే ఉన్నారనే వార్తలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్లోని మురిడ్కేలో ఉన్న తన నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. దుండగులు తొలుత బిలాల్పై కత్తులతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపారు. కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒక ఉగ్రవాద సంస్థలో కీలక నేత సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే హతమయ్యాడనే వార్త సంచలనంగా మారింది.
బిలాల్ ఆరిఫ్ సరాఫీ లష్కరే తోయిబాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడం, వారికి సిద్ధాంతపరంగా శిక్షణ ఇవ్వడం వంటి కార్యకలాపాల్లో ఇతనిది కీలక పాత్ర అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మురిడ్కేలోని లష్కర్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఇతడు తన కార్యకలాపాలను కొనసాగించేవాడు.
పాకిస్థాన్ అధికారులు ఈ హత్య ఘటనపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
బిలాల్ ఆరిఫ్ సరాఫీ లష్కరే తోయిబాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడం, వారికి సిద్ధాంతపరంగా శిక్షణ ఇవ్వడం వంటి కార్యకలాపాల్లో ఇతనిది కీలక పాత్ర అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మురిడ్కేలోని లష్కర్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఇతడు తన కార్యకలాపాలను కొనసాగించేవాడు.
పాకిస్థాన్ అధికారులు ఈ హత్య ఘటనపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.