గోల్డ్ స్మగ్లింగ్: రూ.2 కోట్లు మోసపోయిన కన్నడ నటి రన్యా రావు!
కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన నటి రన్యా రావుకు సంబంధించి ఓ విస్తుపోయే నిజం బయటపడింది. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలని స్మగ్లింగ్ మొదలుపెట్టిన ఆమె, అదే ప్రయత్నంలో ఏజెంట్ చేతిలో మోసపోయి రూ.2 కోట్లు నష్టపోయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడైంది.
తక్కువ ధరకు నేరుగా ఆఫ్రికా గనుల నుంచి బంగారం కొనుగోలు చేయాలని రన్యా ప్లాన్ చేసింది. ఇందుకోసం 'బెన్' అనే ఉగాండా ఏజెంట్ను నమ్మింది. అయితే, ఆ ఏజెంట్ ఆమె నుంచి రూ.2 కోట్లు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేశాడు.
ఆఫ్రికాలో మోసపోయిన తర్వాత, రన్యా తన పంథా మార్చింది. దుబాయ్ మార్కెట్లో బంగారం కొని భారత్కు అక్రమంగా తరలించడం ప్రారంభించింది. తన సవతి తండ్రి సీనియర్ పోలీస్ అధికారి (ఏడీజీపీ) కావడంతో ఎయిర్పోర్టులో లభించే 'ప్రొటోకాల్' సౌకర్యాన్ని దుర్వినియోగం చేసింది. దీని ద్వారా కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి సులభంగా తప్పించుకునేది.
2024 మార్చి నుంచి 2025 మార్చి మధ్య కేవలం ఏడాది కాలంలోనే ఆమె 15 సార్లు దుబాయ్ వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ పర్యటనల్లో సుమారు 127 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. దీని విలువ సుమారు రూ.102 కోట్లు ఉంటుందని అంచనా.
ప్రస్తుతం ఈ కేసులో రన్యా రావు బెంగళూరు సెంట్రల్ జైలులో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆమెకు సుమారు రూ.102.55 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ కేసులో ఆమె తండ్రి పాత్రపై కూడా అంతర్గత విచారణ కొనసాగుతోంది.
తక్కువ ధరకు నేరుగా ఆఫ్రికా గనుల నుంచి బంగారం కొనుగోలు చేయాలని రన్యా ప్లాన్ చేసింది. ఇందుకోసం 'బెన్' అనే ఉగాండా ఏజెంట్ను నమ్మింది. అయితే, ఆ ఏజెంట్ ఆమె నుంచి రూ.2 కోట్లు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేశాడు.
ఆఫ్రికాలో మోసపోయిన తర్వాత, రన్యా తన పంథా మార్చింది. దుబాయ్ మార్కెట్లో బంగారం కొని భారత్కు అక్రమంగా తరలించడం ప్రారంభించింది. తన సవతి తండ్రి సీనియర్ పోలీస్ అధికారి (ఏడీజీపీ) కావడంతో ఎయిర్పోర్టులో లభించే 'ప్రొటోకాల్' సౌకర్యాన్ని దుర్వినియోగం చేసింది. దీని ద్వారా కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి సులభంగా తప్పించుకునేది.
2024 మార్చి నుంచి 2025 మార్చి మధ్య కేవలం ఏడాది కాలంలోనే ఆమె 15 సార్లు దుబాయ్ వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ పర్యటనల్లో సుమారు 127 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. దీని విలువ సుమారు రూ.102 కోట్లు ఉంటుందని అంచనా.
ప్రస్తుతం ఈ కేసులో రన్యా రావు బెంగళూరు సెంట్రల్ జైలులో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆమెకు సుమారు రూ.102.55 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ కేసులో ఆమె తండ్రి పాత్రపై కూడా అంతర్గత విచారణ కొనసాగుతోంది.