తొలిసారిగా 4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
పశ్చిమాసియాకే పరిమితమైన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. ఏకంగా 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం 'డియాగో గార్సియా'ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. ఇరాన్ వద్ద ఇంతటి శక్తిమంతమైన క్షిపణులు ఉన్నాయని అంచనా వేయడంలో విఫలమయ్యామని అమెరికా భావిస్తోంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించగా, ఒకటి సాంకేతిక లోపంతో విఫలమైంది. మరొకటి అమెరికా రక్షణ వ్యవస్థల చేతిలో నిర్వీర్యమైంది. దాడి విఫలమైనప్పటికీ, కీలకమైన యుద్ధ విమానాలు, బాంబర్లు ఉండే స్థావరంపై దాడికి యత్నించడం అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది.
మరోవైపు, ఇరాన్ తన శత్రువులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా భద్రత ఉండదని హెచ్చరించింది. పార్కులు, పర్యాటక కేంద్రాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ఇరాన్ జనరల్ ఒకరు ప్రకటించడం ప్రపంచ ఉగ్రవాద ముప్పుపై ఆందోళనలను పెంచుతోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో రవాణా స్తంభించిపోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉంది.
ఒకవైపు దాడులతో రెచ్చిపోతున్న ఇరాన్, మరోవైపు కీలక నేతలను కోల్పోతోంది. ఈ వారంలోనే అలీ లారిజానీ వంటి ముఖ్య నేతతో పాటు, తాజాగా రివల్యూషనరీ గార్డ్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ కూడా అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం తగ్గలేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించగా, ఒకటి సాంకేతిక లోపంతో విఫలమైంది. మరొకటి అమెరికా రక్షణ వ్యవస్థల చేతిలో నిర్వీర్యమైంది. దాడి విఫలమైనప్పటికీ, కీలకమైన యుద్ధ విమానాలు, బాంబర్లు ఉండే స్థావరంపై దాడికి యత్నించడం అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది.
మరోవైపు, ఇరాన్ తన శత్రువులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా భద్రత ఉండదని హెచ్చరించింది. పార్కులు, పర్యాటక కేంద్రాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ఇరాన్ జనరల్ ఒకరు ప్రకటించడం ప్రపంచ ఉగ్రవాద ముప్పుపై ఆందోళనలను పెంచుతోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో రవాణా స్తంభించిపోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉంది.
ఒకవైపు దాడులతో రెచ్చిపోతున్న ఇరాన్, మరోవైపు కీలక నేతలను కోల్పోతోంది. ఈ వారంలోనే అలీ లారిజానీ వంటి ముఖ్య నేతతో పాటు, తాజాగా రివల్యూషనరీ గార్డ్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ కూడా అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం తగ్గలేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.