తమిళనాట అనూహ్య పొత్తు.. ఒక్కటైన శశికళ, రామదాస్!
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు సీనియర్ నేతలు, పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రామదాస్, జయలలిత నెచ్చెలి వీకే శశికళ అనూహ్యంగా చేతులు కలిపారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త కూటమి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమ సొంత పార్టీల్లోనే ఈ ఇద్దరు నేతలు ఒంటరి కావడం గమనార్హం. పీఎంకేలో తన కుమారుడు అన్బుమణి రామదాస్తో విభేదాల కారణంగా ఎస్.రామదాస్ పార్టీపై పట్టు కోల్పోయారు. మరోవైపు, అన్నాడీఎంకేను దక్కించుకోలేకపోయిన శశికళ 'ఏఐపీటీఎంఎంకే' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే వీరిద్దరూ ఏకమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
విల్లుపురం జిల్లా తైలాపురంలోని రామదాస్ నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ తమ కూటమి తరఫున అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. తమ కూటమిలోకి మరిన్ని చిన్న పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు రామదాస్ తెలిపారు.
ఈ కొత్త కూటమి అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటు బ్యాంకులకు గండి కొట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. "మా పొత్తు ప్రకటనతోనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి" అని రామదాస్ ధీమా వ్యక్తం చేశారు.
తమ సొంత పార్టీల్లోనే ఈ ఇద్దరు నేతలు ఒంటరి కావడం గమనార్హం. పీఎంకేలో తన కుమారుడు అన్బుమణి రామదాస్తో విభేదాల కారణంగా ఎస్.రామదాస్ పార్టీపై పట్టు కోల్పోయారు. మరోవైపు, అన్నాడీఎంకేను దక్కించుకోలేకపోయిన శశికళ 'ఏఐపీటీఎంఎంకే' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే వీరిద్దరూ ఏకమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
విల్లుపురం జిల్లా తైలాపురంలోని రామదాస్ నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ తమ కూటమి తరఫున అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. తమ కూటమిలోకి మరిన్ని చిన్న పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు రామదాస్ తెలిపారు.
ఈ కొత్త కూటమి అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటు బ్యాంకులకు గండి కొట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. "మా పొత్తు ప్రకటనతోనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి" అని రామదాస్ ధీమా వ్యక్తం చేశారు.