కుప్పకూలిన రూపాయి.. 93 దాటి ఆల్ టైమ్ కనిష్ఠానికి!
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా ఇవాళ్టి ట్రేడింగ్లో రూపాయి భారీగా బలహీనపడింది. ఒకే రోజు 0.55 శాతం క్షీణించి, డాలర్కు 93.12 వద్ద కొనసాగుతోంది. బుధవారం నమోదైన 92.63 కనిష్ఠ స్థాయిని కూడా ఇది అధిగమించింది. పశ్చిమాసియాలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ దాదాపు 2 శాతం క్షీణించడం గమనార్హం.
ప్రస్తుతం డాలర్/రూపాయి మారకం 92.8 స్థాయికి పైగా ట్రేడ్ అవుతోందని, ఇది రూపాయిపై ఒత్తిడిని సూచిస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణాలని చెబుతున్నారు.
ఒకవైపు రూపాయి పతనం.. మరోవైపు బుల్ రన్
రూపాయి విలువ కుప్పకూలినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం అనూహ్యంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు పెరిగింది. అయితే, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIలు) నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు. గురువారం ఒక్కరోజే వారు రూ. 7,558.19 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ డేటా స్పష్టం చేస్తోంది.
ఇరాన్ చమురుపై ఆంక్షల సడలింపు సంకేతాలతో తగ్గిన ముడి చమురు ధరలు
మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇరాన్ నుంచి సముద్ర మార్గంలో ఉన్న ముడి చమురుపై ఆంక్షలను సడలించే అవకాశం ఉందని అమెరికా సంకేతాలు ఇవ్వడంతో ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 3.39 శాతం తగ్గి 104.96 డాలర్లకు చేరగా, యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ 3.22 శాతం తగ్గి 92.47 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే, పశ్చిమాసియా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 40 శాతం పెరగడం గమనార్హం.
ప్రస్తుతం డాలర్/రూపాయి మారకం 92.8 స్థాయికి పైగా ట్రేడ్ అవుతోందని, ఇది రూపాయిపై ఒత్తిడిని సూచిస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణాలని చెబుతున్నారు.
ఒకవైపు రూపాయి పతనం.. మరోవైపు బుల్ రన్
రూపాయి విలువ కుప్పకూలినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం అనూహ్యంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు పెరిగింది. అయితే, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIలు) నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు. గురువారం ఒక్కరోజే వారు రూ. 7,558.19 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ డేటా స్పష్టం చేస్తోంది.
ఇరాన్ చమురుపై ఆంక్షల సడలింపు సంకేతాలతో తగ్గిన ముడి చమురు ధరలు
మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇరాన్ నుంచి సముద్ర మార్గంలో ఉన్న ముడి చమురుపై ఆంక్షలను సడలించే అవకాశం ఉందని అమెరికా సంకేతాలు ఇవ్వడంతో ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 3.39 శాతం తగ్గి 104.96 డాలర్లకు చేరగా, యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ 3.22 శాతం తగ్గి 92.47 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే, పశ్చిమాసియా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 40 శాతం పెరగడం గమనార్హం.