ఆ విషయంలో హీరో సూర్య నుంచి స్ఫూర్తి పొందాను: మరో సేవా కార్యక్రమం చేపడతానన్న చిరంజీవి
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగవేళ మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు వంటి సేవా కార్యక్రమాలలో చిరంజీవి ముందున్నారు. ఈరోజు పండుగ సందర్భంగా మున్ముందు పేద పిల్లలకు ఉచిత విద్యకు సహకారం అందిస్తానని వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. కుటుంబంలో ఒక వ్యక్తి విద్యావంతుడు అయితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని అన్నారు. తమిళ నటుడు సూర్య ఇప్పటికే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టారని గుర్తు చేశారు.
తాను ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టడానికి చిరంజీవి స్ఫూర్తి అని సూర్య పలుమార్లు చెప్పాడని తెలిపారు. సూర్య చేస్తున్న విద్యా సేవా కార్యక్రమాలు తనను ఆకర్షించాయని అన్నారు. సేవా కార్యక్రమాలకు సూర్యకు తాను స్ఫూర్తి అయితే, విద్యలో సేవా కార్యక్రమాలకు ఆయన తనకు స్ఫూర్తి అని చిరంజీవి పేర్కొన్నారు. విద్యా సేవా కార్యక్రమాలకు సంబంధించి సూర్య నుంచి నమూనాను తీసుకుని, రెండు తెలుగు రాష్ట్రాలలో భవిష్యత్తులో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తానని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. కుటుంబంలో ఒక వ్యక్తి విద్యావంతుడు అయితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని అన్నారు. తమిళ నటుడు సూర్య ఇప్పటికే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టారని గుర్తు చేశారు.
తాను ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టడానికి చిరంజీవి స్ఫూర్తి అని సూర్య పలుమార్లు చెప్పాడని తెలిపారు. సూర్య చేస్తున్న విద్యా సేవా కార్యక్రమాలు తనను ఆకర్షించాయని అన్నారు. సేవా కార్యక్రమాలకు సూర్యకు తాను స్ఫూర్తి అయితే, విద్యలో సేవా కార్యక్రమాలకు ఆయన తనకు స్ఫూర్తి అని చిరంజీవి పేర్కొన్నారు. విద్యా సేవా కార్యక్రమాలకు సంబంధించి సూర్య నుంచి నమూనాను తీసుకుని, రెండు తెలుగు రాష్ట్రాలలో భవిష్యత్తులో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తానని తెలిపారు.