మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు దుబ్బాక సమీపంలో గండి
- చెల్లాపూర్ గ్రామ సమీపంలో కాలువకు గండి
- మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక ప్రాంతానికి నీరు వెళ్లే కాలువకు గండి
- గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన నీటి పారుదల శాఖ అధికారులు
అధికారులను కలిసిన రైతులు, కాలువకు త్వరగా మరమ్మతులు చేయాలని లేదంటే పంటలు ఎండిపోతాయని విజ్ఞప్తి చేశారు. కాలువను సాధ్యమైనంత తొందరగా బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాల్ కాలువ లైనింగ్ పనుల్లో క్వాలిటీ లేకపోవడం వల్ల కాల్వకు గండిపడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.