వందేమాతరం పాడాల్సిందే.. ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్
అసెంబ్లీలో వందేమాతరం ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించి, వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే వందేమాతరం గానాన్ని తప్పనిసరి చేస్తుందని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఐఎం నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన 'తొక్కుకుంట వచ్చిన' వ్యాఖ్యల వెనుక అంతర్గత రాజకీయాలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత రహస్యంగా మరో పార్టీతో సమావేశమైనందునే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, కేరళ ఎన్నికల ఖర్చుల కోసం తెలంగాణ నుంచి నిధులు తరలిస్తున్నారని, ఈ బాధ్యతను రాహుల్ గాంధీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారని సంచలన ఆరోపణలు చేశారు.
రైతు సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల హామీ ప్రకారం కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సాయం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 22న ఇస్తామన్న రైతు భరోసాతో పాటు పెండింగ్లో ఉన్న ఐదు విడతల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది ప్రక్షాళనపై మాట్లాడుతూ, గుజరాత్లోని సబర్మతి నది తరహాలో అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తామని, అయితే పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బాధితులకు సరైన నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని సూచించారు.
పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, శాసనసభ, స్పీకర్ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు సీఎం, స్పీకర్ తలొగ్గుతున్నారని విమర్శించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతామని చెబుతూ, అసదుద్దీన్ ఓవైసీ నడిపే విద్యాసంస్థల్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం హిందూ బంధువులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన 'తొక్కుకుంట వచ్చిన' వ్యాఖ్యల వెనుక అంతర్గత రాజకీయాలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత రహస్యంగా మరో పార్టీతో సమావేశమైనందునే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, కేరళ ఎన్నికల ఖర్చుల కోసం తెలంగాణ నుంచి నిధులు తరలిస్తున్నారని, ఈ బాధ్యతను రాహుల్ గాంధీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారని సంచలన ఆరోపణలు చేశారు.
రైతు సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల హామీ ప్రకారం కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సాయం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 22న ఇస్తామన్న రైతు భరోసాతో పాటు పెండింగ్లో ఉన్న ఐదు విడతల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది ప్రక్షాళనపై మాట్లాడుతూ, గుజరాత్లోని సబర్మతి నది తరహాలో అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తామని, అయితే పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బాధితులకు సరైన నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని సూచించారు.
పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, శాసనసభ, స్పీకర్ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు సీఎం, స్పీకర్ తలొగ్గుతున్నారని విమర్శించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతామని చెబుతూ, అసదుద్దీన్ ఓవైసీ నడిపే విద్యాసంస్థల్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం హిందూ బంధువులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.