తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు?.. తుది జాబితాలో ముగ్గురు.. రేసులో ఒక మహిళ
తెలంగాణ రాష్ట్రానికి నూతన పోలీస్ బాస్ను నియమించే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన తుది జాబితాను ఖరారు చేసి ప్రభుత్వానికి పంపింది. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ (హోలీహెచ్ఓపీఎఫ్)గా నియమించనుంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగవంతమైంది.
యూపీఎస్సీ ఖరారు చేసిన జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్ పేరు ముందువరుసలో ఉంది. ఆయనతో పాటు 1994 బ్యాచ్కు చెందిన ఆప్టే వినాయక్ ప్రభాకర్ (ప్రస్తుతం ఐబీలో స్పెషల్ డైరెక్టర్గా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు), అదే బ్యాచ్కు చెందిన ప్రస్తుతం తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా పనిచేస్తున్న సౌమ్యా మిశ్రా పేర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ సౌమ్యా మిశ్రాను ఈ పదవికి ఎంపిక చేస్తే, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా డీజీపీగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మూడో పూర్తిస్థాయి డీజీపీ నియామకం కావడం విశేషం. గతంలో అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి మాత్రమే పూర్తిస్థాయి డీజీపీలుగా పనిచేశారు. వారి తర్వాత వచ్చిన అంజనీ కుమార్, రవి గుప్తా, జితేందర్ రెడ్డితో పాటు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలకే పరిమితమయ్యారు. దీంతో పూర్తిస్థాయి అధికారిని నియమించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన వారే డీజీపీలుగా నియమితులు కావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్ వంటి వారు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాతే డీజీపీలుగా పదోన్నతి పొందారు. ఇదే సెంటిమెంట్ పునరావృతమైతే, గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన అనుభవం ఉన్న సీవీ ఆనంద్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.
యూపీఎస్సీ ఖరారు చేసిన జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్ పేరు ముందువరుసలో ఉంది. ఆయనతో పాటు 1994 బ్యాచ్కు చెందిన ఆప్టే వినాయక్ ప్రభాకర్ (ప్రస్తుతం ఐబీలో స్పెషల్ డైరెక్టర్గా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు), అదే బ్యాచ్కు చెందిన ప్రస్తుతం తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా పనిచేస్తున్న సౌమ్యా మిశ్రా పేర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ సౌమ్యా మిశ్రాను ఈ పదవికి ఎంపిక చేస్తే, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా డీజీపీగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మూడో పూర్తిస్థాయి డీజీపీ నియామకం కావడం విశేషం. గతంలో అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి మాత్రమే పూర్తిస్థాయి డీజీపీలుగా పనిచేశారు. వారి తర్వాత వచ్చిన అంజనీ కుమార్, రవి గుప్తా, జితేందర్ రెడ్డితో పాటు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలకే పరిమితమయ్యారు. దీంతో పూర్తిస్థాయి అధికారిని నియమించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన వారే డీజీపీలుగా నియమితులు కావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్ వంటి వారు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాతే డీజీపీలుగా పదోన్నతి పొందారు. ఇదే సెంటిమెంట్ పునరావృతమైతే, గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన అనుభవం ఉన్న సీవీ ఆనంద్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.