పోలవరం నిర్వాసితుల త్యాగం మరువలేనిది.. వారిని గుండెల్లో పెట్టుకుంటాం: సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, భూములు, ఇళ్లు త్యాగం చేసిన వారిని తమ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వారి త్యాగఫలితంగానే రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సమావేశమైన సీఎం, భూసేకరణ, పునరావాస ప్యాకేజీ కింద మూడో విడతగా రూ.226.61 కోట్ల చెక్కును వారికి అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ మొత్తాన్ని నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రాం వాల్ పనులు వారం రోజుల్లో పూర్తి కానున్నాయని ఆయన ప్రకటించారు.
21 నెలల్లో రూ.1943 కోట్ల పరిహారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులకు అండగా నిలుస్తోందని, గత 21 నెలల్లో మూడు విడతల్లో పరిహారం అందించామని సీఎం వివరించారు. 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా తొలి విడత రూ.800 కోట్లు, గత ఏడాది దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లు, తాజాగా ఉగాది సందర్భంగా మూడో విడతగా రూ.226.6 కోట్లు జమ చేశామని తెలిపారు. ఈ 21 నెలల కాలంలో మొత్తంగా 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు. నిర్వాసితుల సంక్షేమం కోసమే రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
గత పాలకుల వల్లే ప్రాజెక్టు ఆలస్యం
గత పాలకుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాల వల్లే డయాఫ్రాం వాల్ తీవ్రంగా దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిపుణులతో అధ్యయనం చేయించి, సుమారు రూ.1000 కోట్లతో కొత్త డయాఫ్రాం వాల్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ చేతగానితనం వల్లే పోలవరం ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యమైందని, కాంట్రాక్టర్లను మార్చకుండా ఉంటే ఇప్పటికే పూర్తయ్యేదని విమర్శించారు. వరదల్లో ప్రజలు మునిగిపోతున్నా నాటి పాలకులు పట్టించుకోలేదని, ప్రాజెక్టు ఏమైనా పర్వాలేదన్న అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.
నిర్మాణ పనులు, పునరావాసం వేగవంతం
వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందని, పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా 75 పునరావాస కాలనీలు నిర్మిస్తుండగా, ఇప్పటికే 26 పూర్తి అయ్యాయని, మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. 2027 ఏప్రిల్ నాటికి నిర్వాసితులందరికీ పక్కా ఇళ్లతో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు, ఇంటి జాగా కోసం ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచామని తెలిపారు. నిర్వాసిత యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తామని కూడా సీఎం హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అందిస్తున్న పరిహారంతో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని నిర్వాసితులు ముఖ్యమంత్రికి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే తమకు న్యాయం జరిగిందని, తమ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయని చెబుతూ పలువురు మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబే కలకాలం సీఎంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఆర్ అండ్ ఆర్ అధికారులు పాల్గొన్నారు.
21 నెలల్లో రూ.1943 కోట్ల పరిహారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులకు అండగా నిలుస్తోందని, గత 21 నెలల్లో మూడు విడతల్లో పరిహారం అందించామని సీఎం వివరించారు. 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా తొలి విడత రూ.800 కోట్లు, గత ఏడాది దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లు, తాజాగా ఉగాది సందర్భంగా మూడో విడతగా రూ.226.6 కోట్లు జమ చేశామని తెలిపారు. ఈ 21 నెలల కాలంలో మొత్తంగా 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు. నిర్వాసితుల సంక్షేమం కోసమే రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
గత పాలకుల వల్లే ప్రాజెక్టు ఆలస్యం
గత పాలకుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాల వల్లే డయాఫ్రాం వాల్ తీవ్రంగా దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిపుణులతో అధ్యయనం చేయించి, సుమారు రూ.1000 కోట్లతో కొత్త డయాఫ్రాం వాల్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ చేతగానితనం వల్లే పోలవరం ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యమైందని, కాంట్రాక్టర్లను మార్చకుండా ఉంటే ఇప్పటికే పూర్తయ్యేదని విమర్శించారు. వరదల్లో ప్రజలు మునిగిపోతున్నా నాటి పాలకులు పట్టించుకోలేదని, ప్రాజెక్టు ఏమైనా పర్వాలేదన్న అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.
నిర్మాణ పనులు, పునరావాసం వేగవంతం
వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందని, పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా 75 పునరావాస కాలనీలు నిర్మిస్తుండగా, ఇప్పటికే 26 పూర్తి అయ్యాయని, మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. 2027 ఏప్రిల్ నాటికి నిర్వాసితులందరికీ పక్కా ఇళ్లతో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు, ఇంటి జాగా కోసం ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచామని తెలిపారు. నిర్వాసిత యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తామని కూడా సీఎం హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అందిస్తున్న పరిహారంతో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని నిర్వాసితులు ముఖ్యమంత్రికి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే తమకు న్యాయం జరిగిందని, తమ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయని చెబుతూ పలువురు మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబే కలకాలం సీఎంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఆర్ అండ్ ఆర్ అధికారులు పాల్గొన్నారు.