నేడు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న జగన్
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు వైసీపీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈరోజు విందును నిర్వహించనుంది. ఈ విందులో వైసీపీ అధినేత జగన్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేసి, వారితో కలిసి ఉపవాస విరమణలో ఆయన పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ సాయంత్రం 6 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి తిరుగుపయనమవుతారు. వైసీపీ ఇఫ్తార్ విందులో పెద్ద సంఖ్యలో ముస్లింలు, మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.