రుణాల రద్దుపై కేంద్రం కీలక ప్రకటన.. 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్
గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని బ్యాంకులు ఏకంగా రూ.9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ (రద్దు) చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ రైటాఫ్ల ప్రక్రియ ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన పాలసీల మేరకే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
"బ్యాంకులు మొండి బకాయిలను (NPA) రైటాఫ్ చేస్తాయి. ముఖ్యంగా నాలుగేళ్ల తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ చేసిన ఖాతాలను ఈ జాబితాలో చేర్చుతారు. అయితే, రైటాఫ్ చేయడం అంటే రుణగ్రహీతల బాధ్యతలను రద్దు చేయడం కాదు. దీనివల్ల రుణగ్రహీతలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని ఆయన వివరించారు. రుణాలు తీసుకున్న వారు వాటిని తిరిగి చెల్లించాల్సిందేనని, రద్దు చేసిన ఖాతాల నుంచి కూడా బకాయిల వసూలు ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని చౌదరి తెలిపారు. వివిధ రికవరీ పద్ధతుల ద్వారా ఈ వసూళ్లను కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఏడాది వారీగా గణాంకాలను పరిశీలిస్తే... 2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.59 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ అయ్యాయని మంత్రి తెలిపారు. అప్పటి నుంచి ఈ మొత్తం తగ్గుతూ వచ్చిందని, 2024-25లో రూ.47,568 కోట్లకు చేరిందని వెల్లడించారు. 2014-15లో రూ.31,723 కోట్లు, 2015-16లో రూ.40,416 కోట్లు, 2016-17లో రూ.68,308 కోట్లు, 2017-18లో రూ.99,132 కోట్లు రైటాఫ్ చేసినట్లు వెల్లడించారు.
క్యాష్ఫ్రీపై ఆర్బీఐ జరిమానా
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను పాటించనందుకు పేమెంట్ అగ్రిగేటర్ సంస్థ 'క్యాష్ఫ్రీ పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'పై రూ.3.1 లక్షల జరిమానా విధించింది. ఎస్క్రో ఖాతా నుంచి కొన్ని "అనుమతి లేని డెబిట్లు" చేసినట్లు ఆర్బీఐ గుర్తించింది. ఈ నెల 9న జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ పెనాల్టీ విధించినట్లు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో కంపెనీ కార్యకలాపాలపై జరిపిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు పీటీఐ తెలిపింది. మొదట క్యాష్ఫ్రీకి నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత ఆరోపణలు రుజువు కావడంతో జరిమానా విధించినట్లు ఆర్బీఐ వివరించింది. ఈ చర్య కేవలం నియంత్రణపరమైన లోపాలపైనేనని, కంపెనీకి, కస్టమర్లకు మధ్య జరిగిన లావాదేవీల చెల్లుబాటును ప్రశ్నించే ఉద్దేశం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
"బ్యాంకులు మొండి బకాయిలను (NPA) రైటాఫ్ చేస్తాయి. ముఖ్యంగా నాలుగేళ్ల తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ చేసిన ఖాతాలను ఈ జాబితాలో చేర్చుతారు. అయితే, రైటాఫ్ చేయడం అంటే రుణగ్రహీతల బాధ్యతలను రద్దు చేయడం కాదు. దీనివల్ల రుణగ్రహీతలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని ఆయన వివరించారు. రుణాలు తీసుకున్న వారు వాటిని తిరిగి చెల్లించాల్సిందేనని, రద్దు చేసిన ఖాతాల నుంచి కూడా బకాయిల వసూలు ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని చౌదరి తెలిపారు. వివిధ రికవరీ పద్ధతుల ద్వారా ఈ వసూళ్లను కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఏడాది వారీగా గణాంకాలను పరిశీలిస్తే... 2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.59 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ అయ్యాయని మంత్రి తెలిపారు. అప్పటి నుంచి ఈ మొత్తం తగ్గుతూ వచ్చిందని, 2024-25లో రూ.47,568 కోట్లకు చేరిందని వెల్లడించారు. 2014-15లో రూ.31,723 కోట్లు, 2015-16లో రూ.40,416 కోట్లు, 2016-17లో రూ.68,308 కోట్లు, 2017-18లో రూ.99,132 కోట్లు రైటాఫ్ చేసినట్లు వెల్లడించారు.
క్యాష్ఫ్రీపై ఆర్బీఐ జరిమానా
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను పాటించనందుకు పేమెంట్ అగ్రిగేటర్ సంస్థ 'క్యాష్ఫ్రీ పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'పై రూ.3.1 లక్షల జరిమానా విధించింది. ఎస్క్రో ఖాతా నుంచి కొన్ని "అనుమతి లేని డెబిట్లు" చేసినట్లు ఆర్బీఐ గుర్తించింది. ఈ నెల 9న జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ పెనాల్టీ విధించినట్లు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో కంపెనీ కార్యకలాపాలపై జరిపిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు పీటీఐ తెలిపింది. మొదట క్యాష్ఫ్రీకి నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత ఆరోపణలు రుజువు కావడంతో జరిమానా విధించినట్లు ఆర్బీఐ వివరించింది. ఈ చర్య కేవలం నియంత్రణపరమైన లోపాలపైనేనని, కంపెనీకి, కస్టమర్లకు మధ్య జరిగిన లావాదేవీల చెల్లుబాటును ప్రశ్నించే ఉద్దేశం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.