మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు

  • క్యాథలిక్ బిషప్‌లతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్
  • సామాజిక సాధికారత, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ
  • విద్య, ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు వెల్లడి
  • లేవనెత్తిన సమస్యలపై కలిసి పనిచేస్తామని లోకేశ్ హామీ
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ క్యాథలిక్ బిషప్‌లతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా వెల్లడించారు. గౌరవనీయులైన క్యాథలిక్ బిషప్‌లకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

ఈ భేటీ సందర్భంగా సామాజిక సాధికారత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిలో చర్చి పోషించాల్సిన పాత్రపై ప్రధానంగా చర్చించినట్లు లోకేశ్ తన పోస్టులో వివరించారు. దీంతో పాటు విద్య, ప్రాతినిధ్యానికి సంబంధించి బిషప్‌లు లేవనెత్తిన అంశాలపైనా చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు.
 

Nara Lokesh
Andhra Pradesh
Catholic Bishops
Education Minister
Social Empowerment
Church Role
State Development
AP Politics

More Telugu News