అసోం నుంచి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ రైలు ప్రారంభం

అసోం, రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలును ప్రధాని అసోంలో ప్రారంభించారు. అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైలు సేవలు అందించనుంది. దీనితో ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.

ఈ రైలు మార్గమధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం పట్టణం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగుతూ, అక్కడి నుంచి చర్లపల్లికి చేరుకుంటుంది.


More Telugu News