LPG Crisis: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. గ్యాస్ గోడౌన్ల వద్ద బారులు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. వంట గ్యాస్ కొరత కారణంగా గృహ వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంట గ్యాస్ ఇళ్ల వరకు రావడానికి రోజుల సమయం పడుతుండటంతో వినియోగదారులు వివిధ ప్రాంతాల్లో గ్యాస్ గోడౌన్ల వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో, జనగాం జిల్లా రఘునాథపల్లిలో వంట గ్యాస్ కోసం ప్రజలు సిలిండర్లతో బారులు తీరారు. మూడు రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రాలేదని వరుసలో నిలబడిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వంట గ్యాస్ ఇళ్ల వరకు రావడానికి రోజుల సమయం పడుతుండటంతో వినియోగదారులు వివిధ ప్రాంతాల్లో గ్యాస్ గోడౌన్ల వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో, జనగాం జిల్లా రఘునాథపల్లిలో వంట గ్యాస్ కోసం ప్రజలు సిలిండర్లతో బారులు తీరారు. మూడు రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రాలేదని వరుసలో నిలబడిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.