ఇరాన్, అమెరికా యుద్ధంతో గ్యాస్ కొరత... హోటళ్లలో ఆ టిఫిన్లకు గుడ్బై
- అధిక గ్యాస్ అవసరమయ్యే దోశ, వడ వంటి ఫలహారాలు తాత్కాలికంగా నిలిపివేత
- తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోటల్ నోటీసు బోర్డుల్లో ప్రత్యక్షం
- దోశకు బదులు శాండ్ విచ్ అందిస్తున్న హోటల్స్
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ఏర్పడి బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు తాత్కాలికంగా మూతపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఆయా నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడుతున్నాయి.
సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే ఫలహారాలను తమ మెనూ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఉదాహరణకు దోశ, మైసూర్ బజ్జీ, వడ వంటి వాటిని మెనూ నుంచి తొలగిస్తున్నారు. వాటికి బదులు శాండ్ విచ్ వంటి ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓవెన్తో అందించే ఫలహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా మెనూలో మార్పులు చేస్తున్నామని హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. దోశ, వడ వంటి పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. అధిక గ్యాస్ వినియోగమయ్యే ఫలహారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే ఫలహారాలను తమ మెనూ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఉదాహరణకు దోశ, మైసూర్ బజ్జీ, వడ వంటి వాటిని మెనూ నుంచి తొలగిస్తున్నారు. వాటికి బదులు శాండ్ విచ్ వంటి ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓవెన్తో అందించే ఫలహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా మెనూలో మార్పులు చేస్తున్నామని హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. దోశ, వడ వంటి పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. అధిక గ్యాస్ వినియోగమయ్యే ఫలహారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.