రేపు టీ20 వరల్డ్ కప్ ఫైనల్... ముగింపు వేడుకల్లో అంతర్జాతీయ, దేశీ తారల సందడి
- టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు ముస్తాబైన నరేంద్ర మోదీ స్టేడియం
- అహ్మదాబాద్లో ముగింపు వేడుకల్లో పాల్గొననున్న గ్లోబల్ స్టార్ రికీ మార్టిన్
- దేశీ గర్బాతో అలరించనున్న ఫాల్గుణి పాఠక్, భాంగ్రా స్టెప్పులతో సుఖ్ బీర్
- ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు వేడుకలు ప్రారంభం
- వేడుకల అనంతరం రాత్రి 7 గంటలకు భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు (మార్చి 8) ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో ఆతిథ్య భారత్ జట్టు, న్యూజిలాండ్తో తలపడనుంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ మ్యాచ్కు ముందు అట్టహాసంగా ముగింపు వేడుకలను నిర్వహించేందుకు ఐసీసీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో గ్లోబల్ పాప్ సూపర్ స్టార్ రికీ మార్టిన్తో పాటు భారతీయ ప్రముఖ గాయకులు ఫాల్గుణి పాఠక్, సుఖ్ బీర్ సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
ఈ ముగింపు వేడుకల్లో గుజరాతీ సంప్రదాయం ఉట్టిపడేలా గాయని ఫాల్గుణి పాఠక్ తన బృందంతో కలిసి గర్బా పాటలతో సందడి చేయనున్నారు. "మైనే పాయల్ హై చంకాయి" వంటి సూపర్ హిట్ పాటలకు 50 మంది బాలీవుడ్ డాన్సర్లు స్టెప్పులు వేయనున్నారు. ఇక పంజాబీ పాప్ రారాజు సుఖ్ బీర్ సింగ్, తన భాంగ్రా బీట్స్, డోలు వాయిద్యాలతో స్టేడియంను హోరెత్తించనున్నారు. "ఇష్క్ (ఓహో హో హో)" వంటి చార్ట్బస్టర్ పాటలతో ఆయన ప్రేక్షకులను ఉత్సాహపరచనున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి ప్రధాన హైలైట్గా రెండు సార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ మార్టిన్ నిలవనున్నారు. "ది కప్ ఆఫ్ లైఫ్", "లివిన్ లా విడా లోకా" వంటి అంతర్జాతీయ హిట్ సాంగ్స్తో ఆయన ముగింపు వేడుకలకు గ్లోబల్ టచ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా రికీ మార్టిన్ మాట్లాడుతూ.. క్రీడలు, సంగీతం ప్రజలను ఏకం చేస్తాయని, భారత్లో ప్రదర్శన ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకే స్టేడియం గేట్లు తెరుచుకోనున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమై, రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. టికెట్లు కలిగిన అభిమానులు ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. లక్షలాది మంది ప్రేక్షకుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకలు టోర్నీకి ఘనమైన ముగింపును ఇవ్వనున్నాయి.
ఈ ముగింపు వేడుకల్లో గుజరాతీ సంప్రదాయం ఉట్టిపడేలా గాయని ఫాల్గుణి పాఠక్ తన బృందంతో కలిసి గర్బా పాటలతో సందడి చేయనున్నారు. "మైనే పాయల్ హై చంకాయి" వంటి సూపర్ హిట్ పాటలకు 50 మంది బాలీవుడ్ డాన్సర్లు స్టెప్పులు వేయనున్నారు. ఇక పంజాబీ పాప్ రారాజు సుఖ్ బీర్ సింగ్, తన భాంగ్రా బీట్స్, డోలు వాయిద్యాలతో స్టేడియంను హోరెత్తించనున్నారు. "ఇష్క్ (ఓహో హో హో)" వంటి చార్ట్బస్టర్ పాటలతో ఆయన ప్రేక్షకులను ఉత్సాహపరచనున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి ప్రధాన హైలైట్గా రెండు సార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ మార్టిన్ నిలవనున్నారు. "ది కప్ ఆఫ్ లైఫ్", "లివిన్ లా విడా లోకా" వంటి అంతర్జాతీయ హిట్ సాంగ్స్తో ఆయన ముగింపు వేడుకలకు గ్లోబల్ టచ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా రికీ మార్టిన్ మాట్లాడుతూ.. క్రీడలు, సంగీతం ప్రజలను ఏకం చేస్తాయని, భారత్లో ప్రదర్శన ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకే స్టేడియం గేట్లు తెరుచుకోనున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమై, రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. టికెట్లు కలిగిన అభిమానులు ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. లక్షలాది మంది ప్రేక్షకుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకలు టోర్నీకి ఘనమైన ముగింపును ఇవ్వనున్నాయి.