శివాజీ రాజా ఇంట విషాదం

  • శివాజీ రాజా తండ్రి రామరాజు కన్నుమూత
  • వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో మృతి
  • మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన స్వగృహంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో శివాజీ రాజా, ఆయన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.


రామరాజు భౌతికకాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం వారి నివాసంలోనే ఉంచారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శివాజీ రాజా తండ్రి మరణవార్త తెలియగానే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు, నిర్మాతలు మరియు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శివాజీ రాజాకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.



More Telugu News