వెస్టిండీస్‌తో డూ ఆర్ డై మ్యాచ్... టాస్ గెలిచిన టీమిండియా

  • కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా
  • మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
  • ఈ మ్యాచ్ గెలిచిన జట్టే సెమీస్ చేరే అవకాశం
  • భారత జట్టులో ఎటువంటి మార్పులూ లేవు
  • వెస్టిండీస్ జట్టులో బ్రాండన్ కింగ్ స్థానంలో అకీల్ హొస్సేన్
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. సూపర్-8 గ్రూప్-1లో జరుగుతున్న ఈ 52వ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్ ఇటు భారత్ కు, అటు వెస్టిండీస్‌కు 'డూ ఆర్ డై' (చావో రేవో) లాంటింది. ఇందులో ఎవరు గెలిస్తే ఆ జట్టే నేరుగా సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించనున్నాయి. ముఖ్యంగా సొంతగడ్డపై ఆడుతుండటం, ఈడెన్ గార్డెన్స్ లో ఛేజింగ్ రికార్డు బాగుండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

టాస్ సందర్భంగా మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. పిచ్ ఛేజింగ్ కు అనుకూలంగా ఉంటుందని, మంచు ప్రభావం కూడా ఉండొచ్చని తెలిపాడు. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు. 

మరోవైపు విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్ళమని అన్నాడు. తమ జట్టులో చాలామందికి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండటం కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ జట్టులో ఒక మార్పు జరిగింది. బ్రాండన్ కింగ్ స్థానంలో స్పిన్నర్ అకీల్ హొస్సేన్ జట్టులోకి వచ్చాడు. ఆశ్చర్యకరంగా రోస్టన్ చేజ్ ఓపెనర్‌గా రానున్నాడు.

జట్ల వివరాలు:

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొస్సేన్, గుడాకేశ్ మోతీ, షామార్ జోసెఫ్.


More Telugu News