అమెరికా దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు మృతి.. ధ్రువీకరించిన ఇరాన్ మీడియా
- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ వారసులు ఖతం
- మరణించిన వారిలో కుమార్తె, మనుమరాలు, అల్లుడు
- ధ్రువీకరించిన ఇరాన్ అధికారిక మీడియా సంస్థలు
- మృతుల్లో కోడలు కూడా ఉన్నట్లు వెల్లడి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాసంపై జరిగిన వైమానిక దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ఖమేనీ కుమార్తె, మనుమరాలితో పాటు ఆయన అల్లుడు, కోడలు కూడా మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. ఖమేనీ నివాసం ఉండే కాంపౌండ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో ఆయన కుటుంబం మొత్తం చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
ఖమేనీ మరణంపై ఇప్పటికే భిన్న కథనాలు వస్తున్న తరుణంలో, ఆయన కుటుంబ సభ్యుల మృతిని ఇరాన్ మీడియా స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఖమేనీ వారసులు ఈ దాడుల్లో బలికావడం ఇరాన్ పాలకులకు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఖమేనీ మరణంపై ఇప్పటికే భిన్న కథనాలు వస్తున్న తరుణంలో, ఆయన కుటుంబ సభ్యుల మృతిని ఇరాన్ మీడియా స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఖమేనీ వారసులు ఈ దాడుల్లో బలికావడం ఇరాన్ పాలకులకు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.