Salman Agha: మా వైఫల్యాలకు అవే కారణాలు.. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా
- శ్రీలంకపై గెలిచినా టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమణ
- నెట్ రన్రేట్ మెరుగుపరుచుకోవడంలో విఫలమైన పాక్ జట్టు
- టాస్ ఓడిపోవడం, మంచు ప్రభావమే దెబ్బతీసిందన్న కెప్టెన్
- మిడిలార్డర్ వైఫల్యం ఏళ్లుగా వేధిస్తోందని సల్మాన్ ఆఘా అంగీకారం
- టోర్నీ అంతటా బ్యాటింగ్లో రాణించలేకపోయామని వెల్లడి
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గెలిచినా పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్క్రమించింది. టోర్నీలో ముందంజ వేయాలంటే మెరుగైన నెట్ రన్రేట్ కోసం శ్రీలంకను 147 పరుగుల లోపు కట్టడి చేయడంలో విఫలమై ఇంటిదారి పట్టింది. పల్లెకెలె వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 8 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయలేకపోయింది. దీంతో న్యూజిలాండ్ను నెట్ రన్రేట్లో అధిగమించలేక టోర్నీ నుంచి తప్పుకుంది.
మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తమ ఓటమికి గల కారణాలను వివరించాడు. "టాస్ ఓడిపోవడమే మమ్మల్ని దెబ్బతీసింది. భారీగా మంచు కురుస్తుండటంతో బౌలర్లకు సవాల్గా మారింది. అలాంటి పిచ్పై ప్రత్యర్థిని 148 పరుగుల లోపు కట్టడి చేయడం ఎప్పుడూ కష్టమే. మేం అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం" అని అన్నాడు. ఒకవేళ టాస్ గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
టోర్నీ మొత్తం తమ జట్టు బ్యాటింగ్ వైఫల్యాలను కూడా ఆఘా అంగీకరించాడు. "టోర్నీ ఆసాంతం మేం బ్యాటింగ్లో విఫలమయ్యాం. ఒక్క సాహిబ్జాదా ఫర్హాన్ మాత్రమే అద్భుతంగా ఆడాడు. అతడికి ఇంకొకరి నుంచి సహకారం అంది ఉంటే కథ వేరేలా ఉండేది. ముఖ్యంగా మిడిలార్డర్ సమస్య మమ్మల్ని చాలా ఏళ్లుగా వేధిస్తోంది. దీనిపై మేం కూర్చుని తీవ్రంగా సమీక్షించుకోవాలి" అని స్పష్టం చేశాడు. చివరి రెండు ఓవర్లలో 10-15 పరుగులు తక్కువ చేశామని, అవే ఫలితాన్ని మార్చేసి ఉండొచ్చని ఆగా పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తమ ఓటమికి గల కారణాలను వివరించాడు. "టాస్ ఓడిపోవడమే మమ్మల్ని దెబ్బతీసింది. భారీగా మంచు కురుస్తుండటంతో బౌలర్లకు సవాల్గా మారింది. అలాంటి పిచ్పై ప్రత్యర్థిని 148 పరుగుల లోపు కట్టడి చేయడం ఎప్పుడూ కష్టమే. మేం అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం" అని అన్నాడు. ఒకవేళ టాస్ గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
టోర్నీ మొత్తం తమ జట్టు బ్యాటింగ్ వైఫల్యాలను కూడా ఆఘా అంగీకరించాడు. "టోర్నీ ఆసాంతం మేం బ్యాటింగ్లో విఫలమయ్యాం. ఒక్క సాహిబ్జాదా ఫర్హాన్ మాత్రమే అద్భుతంగా ఆడాడు. అతడికి ఇంకొకరి నుంచి సహకారం అంది ఉంటే కథ వేరేలా ఉండేది. ముఖ్యంగా మిడిలార్డర్ సమస్య మమ్మల్ని చాలా ఏళ్లుగా వేధిస్తోంది. దీనిపై మేం కూర్చుని తీవ్రంగా సమీక్షించుకోవాలి" అని స్పష్టం చేశాడు. చివరి రెండు ఓవర్లలో 10-15 పరుగులు తక్కువ చేశామని, అవే ఫలితాన్ని మార్చేసి ఉండొచ్చని ఆగా పేర్కొన్నాడు.