ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలి: శ్రీలంక కెప్టెన్ షనక
టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 దశ నుంచే నిష్క్రమించడంపై శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టు ఓటమికి కేవలం ఫిట్నెస్, ఫామ్ మాత్రమే కారణం కాదని, బయట నుంచి సృష్టించిన ప్రతికూల వాతావరణం కూడా జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లను అనవసర విమర్శల నుంచి కాపాడేందుకు ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని అతడు కోరడం చర్చనీయాంశంగా మారింది.
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో ఓటమి అనంతరం షనక మీడియాతో మాట్లాడాడు. "ఆటగాళ్లుగా తాము ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ, బయటి నుంచి వచ్చే నెగెటివ్ వార్తలను నియంత్రించడం చాలా కష్టం. ఈ ప్రతికూల వాతావరణం శ్రీలంక క్రికెట్కు మంచిది కాదు. మేం ప్రపంచకప్ ఓడిపోయామని తెలుసు, దానికి కారణాలూ ఉన్నాయి. కానీ ఈ నెగెటివిటీ ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు?" అని ప్రశ్నించాడు. భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం కోసమైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ తరహా విమర్శలను ఆపితే, అది క్రికెట్కు ఎంతో మేలు చేస్తుందని షనక అభిప్రాయపడ్డాడు.
అంతకుముందు సూపర్ 8 దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్పై పేలవ ప్రదర్శన కనబరచినందుకు దేశ ప్రజలకు షనక క్షమాపణలు చెప్పాడు. ఇంగ్లండ్తో మ్యాచ్ గెలవాల్సిందని, కానీ సమయస్ఫూర్తితో ఆడలేకపోయామని అన్నాడు. అభిమానులకు సంతోషాన్నిచ్చే ఒక్క విజయాన్ని కూడా అందించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. తాము ఊహించినట్లుగా ఇక్కడి పిచ్లు కూడా సహకరించలేదని పేర్కొన్నాడు.
జట్టు ఫిట్నెస్ అత్యున్నత స్థాయిలో లేదని షనక బహిరంగంగా అంగీకరించాడు. "ఈ టోర్నీ ముగిసే సరికి మా జట్టులో నలుగురైదుగురు కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. స్టార్ బౌలర్ మతీశ పతిరణ, ఆల్రౌండర్ వనిందు హసరంగ వంటి ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోవడం జట్టును దెబ్బతీసింది. ఫిట్నెస్ విషయంలో ఇతర జట్లు తమ కంటే ఎంతో ముందున్నాయి" అని స్పష్టం చేశాడు.
ఇక, కెప్టెన్గా తన భవిష్యత్తుపై స్పందిస్తూ.. ఎంతకాలం కెప్టెన్గా ఉంటానో తనకు తెలియదని, ఆ నిర్ణయం సెలక్టర్లు, శ్రీలంక క్రికెట్ బోర్డు పరిధిలో ఉంటుందని చెప్పాడు. కెప్టెన్గా ప్రపంచకప్లో ఆడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని, ఈ ప్రయాణంలో కొన్ని మంచి నిర్ణయాలతో పాటు కొన్ని తప్పులు కూడా చేశానని షనక పేర్కొన్నాడు.
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో ఓటమి అనంతరం షనక మీడియాతో మాట్లాడాడు. "ఆటగాళ్లుగా తాము ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ, బయటి నుంచి వచ్చే నెగెటివ్ వార్తలను నియంత్రించడం చాలా కష్టం. ఈ ప్రతికూల వాతావరణం శ్రీలంక క్రికెట్కు మంచిది కాదు. మేం ప్రపంచకప్ ఓడిపోయామని తెలుసు, దానికి కారణాలూ ఉన్నాయి. కానీ ఈ నెగెటివిటీ ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు?" అని ప్రశ్నించాడు. భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం కోసమైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ తరహా విమర్శలను ఆపితే, అది క్రికెట్కు ఎంతో మేలు చేస్తుందని షనక అభిప్రాయపడ్డాడు.
అంతకుముందు సూపర్ 8 దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్పై పేలవ ప్రదర్శన కనబరచినందుకు దేశ ప్రజలకు షనక క్షమాపణలు చెప్పాడు. ఇంగ్లండ్తో మ్యాచ్ గెలవాల్సిందని, కానీ సమయస్ఫూర్తితో ఆడలేకపోయామని అన్నాడు. అభిమానులకు సంతోషాన్నిచ్చే ఒక్క విజయాన్ని కూడా అందించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. తాము ఊహించినట్లుగా ఇక్కడి పిచ్లు కూడా సహకరించలేదని పేర్కొన్నాడు.
జట్టు ఫిట్నెస్ అత్యున్నత స్థాయిలో లేదని షనక బహిరంగంగా అంగీకరించాడు. "ఈ టోర్నీ ముగిసే సరికి మా జట్టులో నలుగురైదుగురు కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. స్టార్ బౌలర్ మతీశ పతిరణ, ఆల్రౌండర్ వనిందు హసరంగ వంటి ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోవడం జట్టును దెబ్బతీసింది. ఫిట్నెస్ విషయంలో ఇతర జట్లు తమ కంటే ఎంతో ముందున్నాయి" అని స్పష్టం చేశాడు.
ఇక, కెప్టెన్గా తన భవిష్యత్తుపై స్పందిస్తూ.. ఎంతకాలం కెప్టెన్గా ఉంటానో తనకు తెలియదని, ఆ నిర్ణయం సెలక్టర్లు, శ్రీలంక క్రికెట్ బోర్డు పరిధిలో ఉంటుందని చెప్పాడు. కెప్టెన్గా ప్రపంచకప్లో ఆడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని, ఈ ప్రయాణంలో కొన్ని మంచి నిర్ణయాలతో పాటు కొన్ని తప్పులు కూడా చేశానని షనక పేర్కొన్నాడు.