'గేమ్స్ వద్దు.. జాగ్రత్త!': దేశాలకు మాస్ వార్నింగ్
- వాణిజ్య ఒప్పందాలపై వెనక్కి తగ్గితే సహించబోమన్న ట్రంప్
- అమెరికాతో చేసుకున్న డీల్స్ నుంచి వైదొలగొద్దని దేశాలకు హెచ్చరిక
- టారిఫ్లపై ట్రంప్ అధికారాలను కొట్టివేసిన యూఎస్ సుప్రీంకోర్టు
- వెంటనే మరో చట్టం కింద 15శాతం తాత్కాలిక దిగుమతి సుంకం విధింపు
- ట్రంప్ నిర్ణయంతో యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి
అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల విషయంలో ‘ఆటలాడాలని’ చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అలాంటి దేశాలపై ప్రస్తుతం అంగీకరించిన దానికంటే చాలా ఎక్కువ టారిఫ్లు, లైసెన్స్ ఫీజులు విధిస్తామని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. టారిఫ్ల విధింపుపై ట్రంప్కు ఉన్న విశేష అధికారాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇటీవల, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA) కింద విస్తృత స్థాయిలో టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ట్రంప్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది.
అయితే, ఈ తీర్పును అధిగమించేందుకు ట్రంప్ వెంటనే మరో మార్గాన్ని ఎంచుకున్నారు. 1974 నాటి ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 122ను అస్త్రంగా వాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దిగుమతులపై 15 శాతం తాత్కాలిక సుంకాన్ని ప్రకటించారు. ఇది 150 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఈ కొత్త టారిఫ్ ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి రానుంది.
"సుప్రీంకోర్టు ఇచ్చిన హాస్యాస్పద తీర్పుతో ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే, ముఖ్యంగా ఏళ్ల తరబడి అమెరికాను దోచుకున్న దేశాలు వెనక్కి తగ్గాలని ప్రయత్నిస్తే, వారు ఊహించనంత ఎక్కువ టారిఫ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొనుగోలుదారులు జాగ్రత్త!" అని ట్రంప్ తన పోస్ట్లో హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన ఓటింగ్ను యూరోపియన్ పార్లమెంట్ వాయిదా వేసింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.
ఇటీవల, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA) కింద విస్తృత స్థాయిలో టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ట్రంప్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది.
అయితే, ఈ తీర్పును అధిగమించేందుకు ట్రంప్ వెంటనే మరో మార్గాన్ని ఎంచుకున్నారు. 1974 నాటి ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 122ను అస్త్రంగా వాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దిగుమతులపై 15 శాతం తాత్కాలిక సుంకాన్ని ప్రకటించారు. ఇది 150 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఈ కొత్త టారిఫ్ ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి రానుంది.
"సుప్రీంకోర్టు ఇచ్చిన హాస్యాస్పద తీర్పుతో ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే, ముఖ్యంగా ఏళ్ల తరబడి అమెరికాను దోచుకున్న దేశాలు వెనక్కి తగ్గాలని ప్రయత్నిస్తే, వారు ఊహించనంత ఎక్కువ టారిఫ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొనుగోలుదారులు జాగ్రత్త!" అని ట్రంప్ తన పోస్ట్లో హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన ఓటింగ్ను యూరోపియన్ పార్లమెంట్ వాయిదా వేసింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.