సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్ వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపించింది. దీనిని వెనక్కి పంపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ కేసులో అల్లు అర్జున్ సహా 23 మందిపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే ఛార్జ్‌షీట్‌లో నాంపల్లి కోర్టు సాంకేతిక లోపాలను గుర్తించింది.

ఎవిడెన్స్ మెటీరియల్ సమగ్రంగా లేదని, సాక్ష్యాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, సీడీలను జతచేయకపోవడంతో కోర్టు ఛార్జ్‌షీట్‌ను వెనక్కి పంపించింది. ఎలాంటి లోపాలు లేకుండా ఫార్మాట్ ప్రకారం, ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అన్నింటికి ఆధారాలతో మరోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. గతంలో రెండుసార్లు కూడా ఛార్జ్‌షీట్‌లో సాంకేతిక కారణాలు చూపిస్తూ కోర్టు వెనక్కి పంపించింది.

Allu Arjun
Sandhya Theatre
Stampede
Nampally Court
Charge sheet
Chikkadpally Police

More Telugu News