బుర్ఖా ధరించి బస్సులో మహిళల పక్కన కూర్చున్న వ్యక్తి.. కోరుట్లలో ఘటన

  • కోరుట్ల బస్టాండ్‌లో బుర్ఖా ధరించి బస్సు ఎక్కిన యువకుడు
  • ఫోన్ మాట్లాడుతుండగా మగ గొంతుగా గుర్తించిన ప్రయాణికులు
  • ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రీల్స్ కోసం బుర్ఖా ధరించినట్లు తెలిపిన యువకుడు
తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్లలో ఒక యువకుడు రీల్స్ కోసం బుర్ఖా వేసుకుని బస్సు ఎక్కడం కలకలం రేపింది. యువకుడు బుర్ఖా వేసుకుని బస్సులో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. బుర్ఖాలోని వ్యక్తిది మగ గొంతుగా గుర్తించిన ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బస్ స్టేషన్ వద్దకు చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తాను రీల్స్ కోసం బుర్ఖా ధరించానని ఆ యువకుడు వెల్లడించాడు. బుర్ఖా ధరించిన వ్యక్తి మహిళల పక్కన కూర్చున్నాడు. దీంతో ఆడవాళ్ల పక్కన కూర్చోవడానికి బుర్ఖా ధరించావా అంటూ పోలీసులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News