ఏఐతో ఐటీ సేవలకు ముప్పుందా?... జేపీ మోర్గాన్ నివేదిక ఏం చెబుతోందంటే...!
- ఏఐతో ఐటీ సర్వీసెస్ కంపెనీలకు ముప్పు లేదన్న జేపీ మోర్గాన్
- ఉద్యోగాలను తీసేయదు, కొత్త పనులను సృష్టిస్తుందని వెల్లడి
- గతంలోని క్లౌడ్ కంప్యూటింగ్ వంటిదే ఏఐ కూడా అని విశ్లేషణ
- టెక్ ప్రపంచంలో ఐటీ కంపెనీలను ‘ప్లంబర్లు’గా అభివర్ణన
- ఏఐపై పెట్టుబడిదారుల్లో భయాలు అక్కర్లేదని స్పష్టం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఐటీ సర్వీసెస్ కంపెనీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనల నడుమ ప్రముఖ రీసెర్చ్ సంస్థ జేపీ మోర్గాన్ కీలక నివేదికను విడుదల చేసింది. ఏఐ వల్ల ఐటీ రంగం పరిధి తగ్గిపోదని, సమీప భవిష్యత్తులో ఈ రంగం అంతరించిపోయే ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. పైగా, ఏఐ అనేది ఐటీ కంపెనీలకు మరో శక్తివంతమైన సాధనంగా (టూల్) మారి, మరిన్ని కొత్త పనులను సృష్టిస్తుందని పేర్కొంది.
'ఇండియా ఐటీ సర్వీసెస్: లుకింగ్ త్రూ ది ఏఐ ఫాగ్' పేరుతో జేపీ మోర్గాన్ ఆసియా పసిఫిక్ ఈక్విటీ రీసెర్చ్ బృందం ఈ నివేదికను రూపొందించింది. ఏఐ కారణంగా భారత ఐటీ సంస్థలు కనుమరుగవుతాయన్న భయాల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం మాట అటుంచి, కొత్త పని అవకాశాలు పుట్టుకొస్తాయని వివరించింది.
గతంలో ఆఫ్షోర్ లేబర్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక మార్పులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని నివేదిక గుర్తుచేసింది. ఆ టెక్నాలజీలు ఐటీ సేవలను అంతం చేయలేదు, కేవలం పనిచేసే విధానాన్ని మాత్రమే మార్చాయి. ఇప్పుడు ఏఐ కూడా అదే పాత్ర పోషిస్తుందని, అందుబాటులో ఉన్న బడ్జెట్లతోనే కంపెనీలు మరిన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏఐ ఉపయోగపడుతుందని విశ్లేషించింది.
పాత లెగాసీ సిస్టమ్లను ఆధునికీకరించడం, సాస్ (SaaS) అప్లికేషన్లను మార్చడం, ఏఐ ఏజెంట్లను నిర్మించడం, ఏఐ సిస్టమ్లలో విశ్వసనీయతను కల్పించడం వంటి అనేక కొత్త రంగాల్లో ఐటీ సేవల అవసరం పెరుగుతుందని జేపీ మోర్గాన్ పేర్కొంది. టెక్ ప్రపంచంలో ఐటీ కంపెనీల పాత్రను 'ప్లంబర్ల'తో పోల్చింది. క్లిష్టమైన వ్యవస్థలను సజావుగా నడిపించడంలో వాటి పాత్ర అత్యంత కీలకమని అభివర్ణించింది. కేవలం ఏఐ భయాలతో ఐటీ స్టాక్స్ బలహీనపడటం సరికాదని, పెట్టుబడిదారుల ఆందోళనలు వాస్తవ దూరమని నివేదిక స్పష్టం చేసింది.
'ఇండియా ఐటీ సర్వీసెస్: లుకింగ్ త్రూ ది ఏఐ ఫాగ్' పేరుతో జేపీ మోర్గాన్ ఆసియా పసిఫిక్ ఈక్విటీ రీసెర్చ్ బృందం ఈ నివేదికను రూపొందించింది. ఏఐ కారణంగా భారత ఐటీ సంస్థలు కనుమరుగవుతాయన్న భయాల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం మాట అటుంచి, కొత్త పని అవకాశాలు పుట్టుకొస్తాయని వివరించింది.
గతంలో ఆఫ్షోర్ లేబర్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక మార్పులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని నివేదిక గుర్తుచేసింది. ఆ టెక్నాలజీలు ఐటీ సేవలను అంతం చేయలేదు, కేవలం పనిచేసే విధానాన్ని మాత్రమే మార్చాయి. ఇప్పుడు ఏఐ కూడా అదే పాత్ర పోషిస్తుందని, అందుబాటులో ఉన్న బడ్జెట్లతోనే కంపెనీలు మరిన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏఐ ఉపయోగపడుతుందని విశ్లేషించింది.
పాత లెగాసీ సిస్టమ్లను ఆధునికీకరించడం, సాస్ (SaaS) అప్లికేషన్లను మార్చడం, ఏఐ ఏజెంట్లను నిర్మించడం, ఏఐ సిస్టమ్లలో విశ్వసనీయతను కల్పించడం వంటి అనేక కొత్త రంగాల్లో ఐటీ సేవల అవసరం పెరుగుతుందని జేపీ మోర్గాన్ పేర్కొంది. టెక్ ప్రపంచంలో ఐటీ కంపెనీల పాత్రను 'ప్లంబర్ల'తో పోల్చింది. క్లిష్టమైన వ్యవస్థలను సజావుగా నడిపించడంలో వాటి పాత్ర అత్యంత కీలకమని అభివర్ణించింది. కేవలం ఏఐ భయాలతో ఐటీ స్టాక్స్ బలహీనపడటం సరికాదని, పెట్టుబడిదారుల ఆందోళనలు వాస్తవ దూరమని నివేదిక స్పష్టం చేసింది.