HYDRA Hyderabad: వంద కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. ఎక్కడంటే!

HYDRA Saves 100 Crore Worth Land in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు తాజాగా వంద కోట్ల విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని కాపాడారు. ఆక్రమణలు కూల్చివేసి కబ్జాదారుల చెర నుంచి విలువైన భూమిని విడిపించారు. అమీన్ పూర్ లోని చక్రపురి లేఔట్ లో రోడ్లు, పార్కు స్థలం కబ్జాకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం బుల్డోజర్లతో అమీన్ పూర్ చేరుకున్న అధికారులు.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేశారు.

పోలీస్ సిబ్బంది బందోబస్తుతో రెవెన్యూ అధికారుల సమక్షంలో హైడ్రా అధికారులు మొత్తం 15 జేసీబీలతో ఆక్రమణలు తొలగించారు. దీంతో పాటు మేడ్చల్- మ‌ల్కాజిగిరి జిల్లా దూల‌ప‌ల్లి విలేజ్‌లోని సుమారుకుంట‌లో, నాగారం రామకృష్ణ నగర్ కాలనీలోని శివాల‌యానికి చెందిన 1,365 గజాల స్థలాన్ని, యూసుఫ్గూడలో మూడున్నర ఎక‌రాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది.
Go Back to Shorts
HYDRA Hyderabad
Hyderabad HYDRA
Telangana land encroachment
Ameenpur land
Doolapally land
Yousufguda land
Government land recovery
Land grabbing Hyderabad
Chakrapuri layout
Medchal Malkajgiri

More Telugu News