RS Praveen Kumar: ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం... ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
- ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తున్న ఎప్స్టీన్ కుంభకోణంతో పోల్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రమాదం అనుమానాలకు తావిస్తోందన్న బీఆర్ఎస్ నేత
- ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారని ట్వీట్
నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఓటుకు నోటు ఆధారాలను ధ్వంసం చేయడానికేనా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. దీనిని రీట్వీట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
పోలీసు శాఖకు అత్యంత కీలకమైన, గట్టి భద్రత ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని, అనేక సున్నితమైన కేసులకు సంబంధించిన ఆధారాలు(2015 నాటి ఓటుకు నోటు కేసుతో సహా ) ఇందులో భద్రపరచి ఉన్నాయని పేర్కొన్నారు. వాటి పరిస్థితి ఏమిటి? దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు.
అమెరికాలో ఎంతోమంది చిన్నారులను అపర కుబేరులకు అర్పించిన లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్ జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా, ఎప్స్టీన్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
పోలీసు శాఖకు అత్యంత కీలకమైన, గట్టి భద్రత ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని, అనేక సున్నితమైన కేసులకు సంబంధించిన ఆధారాలు(2015 నాటి ఓటుకు నోటు కేసుతో సహా ) ఇందులో భద్రపరచి ఉన్నాయని పేర్కొన్నారు. వాటి పరిస్థితి ఏమిటి? దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు.
అమెరికాలో ఎంతోమంది చిన్నారులను అపర కుబేరులకు అర్పించిన లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్ జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా, ఎప్స్టీన్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.