దావోస్‌లో కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఆ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్

  • దావోస్ వేదికగా అమెరికా 'గ్రీన్‌లాండ్' సుంకాలను వ్యతిరేకించిన కెనడా ప్రధాని
  • బలవంతులు సొంత ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శ
  • గాజా శాంతి మండలిలో చేరాలని కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
గాజా శాంతి మండలిలో చేరాలంటూ కెనడాకు పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు ఏర్పడిన ప్రతిష్ఠాత్మక బోర్డులలో గాజా శాంతి మండలి కూడా ఒకటని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ దావోస్ వేదికగా అమెరికా 'గ్రీన్‌లాండ్' సుంకాలను వ్యతిరేకించడంతో ట్రంప్ ఈ ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్నారు.

దావోస్‌లో జరిగిన సమావేశంలో మార్క్ కార్నీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం పరివర్తన దిశగా కాకుండా విచ్ఛిన్నం వైపు పయనిస్తోందని ఆయన అన్నారు. ఒకప్పుడు భాగస్వామ్య దేశాల శ్రేయస్సు కోసం చేసుకున్న ఆర్థిక ఒప్పందాలను ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్న దేశం ఆయుధంగా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. బలవంతులు తమ సొంత ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

అందులో భాగంగానే ఇష్టానుసారంగా వాణిజ్య నియమాలను అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంతకాలం భౌగోళిక పరిస్థితులు, ప్రపంచ దేశాలతో మైత్రి మాత్రమే దేశ శ్రేయస్సు, భద్రతకు హామీ ఇస్తాయని నమ్మేవారమని, ఆ నమ్మకాలు ఇక ఎప్పటికీ తిరిగి రావని ఆయన అన్నారు.


More Telugu News