Priyanka: శిశు విక్రయాల కేసు.. లొంగుబాటుకు సూత్రధారి ప్రియాంక సిద్ధం!
- పోలీసుల నిఘా ముమ్మరం కావడంతో ఉత్తరాఖండ్ నుంచి విజయవాడకు రాక
- నిందితుల బ్యాంకు ఖాతాల స్తంభింపు.. ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా
- నేరగాళ్లపై రౌడీషీట్లు తెరిచేందుకు కసరత్తు
- నిందితుడు అనిల్కు న్యాయస్థానం రిమాండ్
- పరారీలో ఉన్న నూరి కోసం గాలింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శిశు విక్రయాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఢిల్లీ ముఠాలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రియాంక త్వరలో పోలీసులకు లొంగిపోనున్నట్లు సమాచారం. విజయవాడ పోలీసులు ఆమె కోసం ఢిల్లీ, మీరట్ ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కు పరారైంది. అయితే అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడం, మీరట్లోని తన అత్తమామలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో న్యాయవాదితో కలిసి విజయవాడ వచ్చి లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
పిల్లల విక్రయాల ద్వారా ప్రియాంక భారీగా అక్రమ ఆస్తులు గడించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆర్థిక లావాదేవీలను వెలికితీసేందుకు సంబంధిత బ్యాంకులకు లేఖలు రాశారు. ఆ ఖాతాల వివరాలు అందిన వెంటనే వాటిని స్తంభింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ లావాదేవీల విశ్లేషణ ద్వారా ఈ ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.
నిందితులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అవే నేరాలకు పాల్పడుతుండటంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీకి చెందిన ఆరుగురు నిందితులపై త్వరలోనే రౌడీషీట్లు తెరవనున్నారు. దీనివల్ల వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచే వీలుంటుంది.
మరోవైపు, ఈ కేసులో నిందితుడైన అనిల్కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మహారాష్ట్ర జైలులో ఉన్న అతడిని పీటీ వారెంట్పై విజయవాడకు తరలించిన పోలీసులు శుక్రవారం న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ఈ విక్రయాల్లో కిరణ్ పెదనాన్న ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో ఇంకా పరారీలో ఉన్న నూరి కోసం ఒక బృందం థానేకు వెళ్లనుండగా, మరో నిందితురాలు ఫరీనా కస్టడీపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
పిల్లల విక్రయాల ద్వారా ప్రియాంక భారీగా అక్రమ ఆస్తులు గడించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆర్థిక లావాదేవీలను వెలికితీసేందుకు సంబంధిత బ్యాంకులకు లేఖలు రాశారు. ఆ ఖాతాల వివరాలు అందిన వెంటనే వాటిని స్తంభింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ లావాదేవీల విశ్లేషణ ద్వారా ఈ ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.
నిందితులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అవే నేరాలకు పాల్పడుతుండటంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీకి చెందిన ఆరుగురు నిందితులపై త్వరలోనే రౌడీషీట్లు తెరవనున్నారు. దీనివల్ల వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచే వీలుంటుంది.
మరోవైపు, ఈ కేసులో నిందితుడైన అనిల్కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మహారాష్ట్ర జైలులో ఉన్న అతడిని పీటీ వారెంట్పై విజయవాడకు తరలించిన పోలీసులు శుక్రవారం న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ఈ విక్రయాల్లో కిరణ్ పెదనాన్న ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో ఇంకా పరారీలో ఉన్న నూరి కోసం ఒక బృందం థానేకు వెళ్లనుండగా, మరో నిందితురాలు ఫరీనా కస్టడీపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.