ప్రియుడు అనుమానించాడని... వాటర్ ట్యాంకు పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

Aishwarya Commits Suicide After Boyfriend Suspects Her
హైదరాబాద్‌లోని నాగోల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు అనుమానించాడనే మనస్తాపంతో ఓ యువతి వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందగా, ఘటనకు కారణమైన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఐశ్వర్య (19) తన అన్నతో కలిసి నాగోలు సమీపంలోని తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీలో నివసిస్తోంది. ఆమె దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) హస్తినాపురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఏడాది క్రితం ఓ పూజలో పరిచయమైన వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, మొదట నిరాకరించిన పెద్దలు తర్వాత అంగీకరించారు.

అయితే, ఐశ్వర్య తరచూ ఫోన్‌లో వేరొకరితో మాట్లాడుతోందని ఆనంద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 5న ఇద్దరూ హౌసింగ్ బోర్డు కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫోన్ కాల్స్ విషయంపై ఆనంద్ ఆమెను నిలదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య, ట్యాంక్ పైనుంచి కిందకు దూకేసింది.

తీవ్ర గాయాలైన ఆమెను నాగోల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ఆనందే కారణమని ఐశ్వర్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మహేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Go Back to Shorts
Aishwarya
Hyderabad
Nalgonda
Suicide
Love affair
Harassment
Crime news
Telangana
Water tank suicide
Youth suicide

More Telugu News