Chandrababu Naidu: రేపు ఢిల్లీ వెళుతున్న సీఎం చంద్రబాబు... పర్యటన షెడ్యూల్ ఇదిగో!
- రేపు అమిత్ షాతో డిన్నర్ మీటింగ్
- రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చ
- కేంద్ర సహకారంపై కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జనవరి 7) ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. వీరిద్దరి మధ్య డిన్నర్ మీటింగ్ జరగనుండగా, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ వేదిక కానుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఇరువురు నేతలు చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం సాధించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం... బుధవారం సాయంత్రం 3:30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ ఉంటుంది. అనంతరం రాత్రి 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో తిరుగుపయనమై, అర్ధరాత్రి 1:30 గంటలకు విజయవాడ సమీపంలోని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనకు రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఇరువురు నేతలు చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం సాధించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం... బుధవారం సాయంత్రం 3:30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ ఉంటుంది. అనంతరం రాత్రి 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో తిరుగుపయనమై, అర్ధరాత్రి 1:30 గంటలకు విజయవాడ సమీపంలోని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనకు రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యత ఏర్పడింది.