ఎస్ఐఆర్ కోసం బీజేపీ ఐటీ విభాగం యాప్ను ఉపయోగిస్తున్నారు: మమతా బెనర్జీ ఆరోపణ
- ఈసీ ఆ యాప్ను వినియోగిస్తోందని ఆరోపణ
- ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య
- అర్హులైన ఓటర్లను చనిపోయినట్లుగా చూపిస్తోందని మండిపాటు
ఎన్నికల సంఘం రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామ్య వ్యతిరేక, తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని ఆమె ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఈసీ అన్ని విధాలా తప్పులతడకగా నిర్వహిస్తోందని మండిపడ్డారు. వృద్ధులు, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తూ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్లను మరణించినట్లుగా చూపిస్తోందని ఆరోపించారు.
మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆమె ఆరోపణలు నిరాధారమని, రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొంది.