Kranti Gaud: స్టార్ క్రికెటర్ క్రాంతిగౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం
- 13 ఏళ్ల తర్వాత పోలీస్ కానిస్టేబుల్గా విధుల్లో చేరనున్న క్రాంతిగౌడ్ తండ్రి మున్నా సింగ్
- ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలతో 2012లో ఉద్యోగం నుంచి తొలగింపు
- ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా తండ్రికి ఉద్యోగం ఇప్పించాలని సీఎంను కోరిన క్రాంతి
- రూ. కోటి నగదు బహుమతితో పాటు తండ్రికి ఉద్యోగమిచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ క్రాంతిగౌడ్ తన క్రీడా ప్రతిభతో దేశానికి కీర్తిని తేవడమే కాకుండా తన తండ్రి కోల్పోయిన గౌరవాన్ని కూడా తిరిగి సంపాదించి పెట్టింది. 13 ఏళ్ల క్రితం బర్తరఫ్ అయిన ఆమె తండ్రి మున్నాసింగ్ గౌడ్ను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఛతర్పూర్ జిల్లాకు చెందిన క్రాంతి గౌడ్ తండ్రి మున్నాసింగ్ గతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. 2012లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. క్రాంతి సోదరులు కూలీలుగా, బస్సు కండక్టర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. అలాంటి కష్టకాలంలోనూ క్రాంతి క్రికెట్పై మక్కువ తగ్గకుండా కష్టపడి జాతీయ జట్టులో చోటు సంపాదించింది.
ఇటీవల ముగిసిన మహిళా వన్డే ప్రపంచకప్లో భారత విజయంలో క్రాంతి కీలక పాత్ర పోషించింది. 8 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసుకుని సత్తా చాటింది. నవంబర్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమెను సన్మానించిన సమయంలో క్రాంతి తన కుటుంబ కష్టాలను వివరించారు. తన తండ్రిని మళ్లీ పోలీస్ యూనిఫాంలో చూడాలని ఉందని, ఆయన గౌరవంగా పదవీ విరమణ చేసే అవకాశం కల్పించాలని సీఎంను కోరారు. ఆ విన్నపానికి స్పందించిన ముఖ్యమంత్రి ఆమె తండ్రిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు ప్రధాన కార్యాలయం మున్నా సింగ్ పునర్నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. "మా ప్రభుత్వం క్రీడాకారుల కష్టాన్ని గుర్తిస్తుంది. క్రాంతి గౌడ్ విన్నపాన్ని మన్నించి, ఆమె తండ్రిని విధుల్లోకి చేర్చుకున్నాం" అని మధ్యప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా ప్రభుత్వం క్రాంతికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందజేసింది.
ఛతర్పూర్ జిల్లాకు చెందిన క్రాంతి గౌడ్ తండ్రి మున్నాసింగ్ గతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. 2012లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. క్రాంతి సోదరులు కూలీలుగా, బస్సు కండక్టర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. అలాంటి కష్టకాలంలోనూ క్రాంతి క్రికెట్పై మక్కువ తగ్గకుండా కష్టపడి జాతీయ జట్టులో చోటు సంపాదించింది.
ఇటీవల ముగిసిన మహిళా వన్డే ప్రపంచకప్లో భారత విజయంలో క్రాంతి కీలక పాత్ర పోషించింది. 8 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసుకుని సత్తా చాటింది. నవంబర్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమెను సన్మానించిన సమయంలో క్రాంతి తన కుటుంబ కష్టాలను వివరించారు. తన తండ్రిని మళ్లీ పోలీస్ యూనిఫాంలో చూడాలని ఉందని, ఆయన గౌరవంగా పదవీ విరమణ చేసే అవకాశం కల్పించాలని సీఎంను కోరారు. ఆ విన్నపానికి స్పందించిన ముఖ్యమంత్రి ఆమె తండ్రిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు ప్రధాన కార్యాలయం మున్నా సింగ్ పునర్నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. "మా ప్రభుత్వం క్రీడాకారుల కష్టాన్ని గుర్తిస్తుంది. క్రాంతి గౌడ్ విన్నపాన్ని మన్నించి, ఆమె తండ్రిని విధుల్లోకి చేర్చుకున్నాం" అని మధ్యప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా ప్రభుత్వం క్రాంతికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందజేసింది.