Pawan Kalyan: శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన
కోనసీమ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో మరో కీలక అడుగు పడింది. జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కోనసీమలోని కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రత్యేకంగా, రాజోలు పర్యటనలో 45 రోజుల్లో సమస్యను పూర్తి చేయాలని హామీ ఇచ్చినప్పటికీ, 35 రోజుల్లోపే ఈ డ్రెయిన్ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించింది.
డ్రెయిన్ ఆధునికీకరణ ద్వారా జిల్లా అభివృద్ధిలో కొత్త దశ ప్రారంభంకానుంది. శంకరగుప్తంలోని వర్షకాల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి ఇది దోహదపడనుంది.