Swiggy: పదేళ్లుగా అదే జోరు.. స్విగ్గీలో మళ్లీ బిర్యానీయే టాప్!

Swiggy Reports Biryani Most Ordered Dish in India for 2025
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన 2025 వార్షిక నివేదికను విడుదల చేసింది. ఊహించినట్లే, ఈ ఏడాది కూడా భారతీయులు బిర్యానీకే జై కొట్టారు. వరుసగా పదో ఏడాది కూడా దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. 2025లో స్విగ్గీ ద్వారా ఏకంగా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ అయినట్లు నివేదిక వెల్లడించింది.

నివేదిక ప్రకారం, ఈ ఏడాది దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 194 బిర్యానీలు, అంటే ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్ నమోదైంది. మొత్తం బిర్యానీ ఆర్డర్లలో చికెన్ బిర్యానీదే సింహభాగం. సుమారు 5.77 కోట్ల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ టాప్‌లో ఉంది. బిర్యానీ తర్వాత బర్గర్ (4.42 కోట్లు), పిజ్జా (4.01 కోట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

భారతదేశంలో ఫుడ్ ట్రెండ్స్ మారినా, బిర్యానీపై ప్రేమ మాత్రం స్థిరంగా ఉందని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. "బిర్యానీ తిరుగులేని రాజు అని మరోసారి రుజువైంది. ఈ సుగంధభరితమైన వంటకంపై భారతీయుల ప్రేమ ఎప్పటికీ తగ్గదు" అని తెలిపింది. ఈ గణాంకాల వెనుక వినియోగదారుల జ్ఞాపకాలు, సంతోషకరమైన క్షణాలు దాగి ఉన్నాయని స్విగ్గీ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ అన్నారు. "ప్రజల సంతోషంలో తాము భాగమైనందుకు గర్వంగా ఉంది" అని ఆయన వివరించారు.

ప్రతి ఏడాది స్విగ్గీ 'హౌ ఇండియా స్విగ్గీ'డ్' పేరుతో ఈ నివేదికను విడుదల చేస్తుంది. వినియోగదారుల ఆహారపు అలవాట్లు, దేశవ్యాప్తంగా మారుతున్న ఫుడ్ ట్రెండ్స్‌ను ఈ రిపోర్ట్ విశ్లేషిస్తుంది.
Go Back to Shorts
Swiggy
Biryani
Food delivery
Chicken Biryani
India food orders
Swiggy India
Rohit Kapoor
Food trends India
Online food order
Burger

More Telugu News