అమరావతి కనెక్టివిటీయే లక్ష్యం... కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
- ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
- అమరావతికి జాతీయ రహదారుల అనుసంధానంపై ప్రధానంగా చర్చ
- కృష్ణా నదిపై ఆరు లేన్ల ఐకానిక్ వంతెన నిర్మించాలని విజ్ఞప్తి
- హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన
- రాజధానిని లాజిస్టిక్స్ నోడ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యుత్తమ రహదారి కనెక్టివిటీని కల్పించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాజధాని నగరాన్ని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించే కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ ను బలోపేతం చేయడంలో గడ్కరీ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు.
ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి అత్యంత కీలకమైన రెండు ప్రధాన ప్రాజెక్టులను చంద్రబాబు ప్రస్తావించారు. కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన నిర్మాణ బాధ్యతను జాతీయ రహదారుల సంస్థ (NHAI) చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూలపాడు వద్ద నిర్మించ తలపెట్టిన ఈ వంతెన, అమరావతిని మూడు కీలక జాతీయ రహదారులతో అనుసంధానిస్తుందని వివరించారు.
విజయవాడ-హైదరాబాద్, చెన్నై-కోల్కతా జాతీయ రహదారులతో పాటు తీరప్రాంత రోడ్ కారిడార్తో ఈ వంతెన రాజధానికి వారధిగా నిలుస్తుందని తెలిపారు. ఒక ప్రధాన నదిపై నిర్మించే ఈ ఐకానిక్ వంతెన రాష్ట్ర రాజధానికి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, దీని నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని కోరారు.
అలాగే, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి కూడా చంద్రబాబు చర్చించారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే రెండు నగరాల మధ్య హై-స్పీడ్ యాక్సెస్ ఏర్పడుతుందని, తద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు కేవలం కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా, అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్లో ఒక ప్రధాన మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్గా మారుస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి ప్రత్యక్ష, పరోక్ష నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గడ్కరీకి వివరించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి అత్యంత కీలకమైన రెండు ప్రధాన ప్రాజెక్టులను చంద్రబాబు ప్రస్తావించారు. కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన నిర్మాణ బాధ్యతను జాతీయ రహదారుల సంస్థ (NHAI) చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూలపాడు వద్ద నిర్మించ తలపెట్టిన ఈ వంతెన, అమరావతిని మూడు కీలక జాతీయ రహదారులతో అనుసంధానిస్తుందని వివరించారు.
విజయవాడ-హైదరాబాద్, చెన్నై-కోల్కతా జాతీయ రహదారులతో పాటు తీరప్రాంత రోడ్ కారిడార్తో ఈ వంతెన రాజధానికి వారధిగా నిలుస్తుందని తెలిపారు. ఒక ప్రధాన నదిపై నిర్మించే ఈ ఐకానిక్ వంతెన రాష్ట్ర రాజధానికి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, దీని నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని కోరారు.
అలాగే, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి కూడా చంద్రబాబు చర్చించారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే రెండు నగరాల మధ్య హై-స్పీడ్ యాక్సెస్ ఏర్పడుతుందని, తద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు కేవలం కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా, అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్లో ఒక ప్రధాన మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్గా మారుస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి ప్రత్యక్ష, పరోక్ష నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గడ్కరీకి వివరించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.