Ramakishtaiah: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు... కొడుకుపై తండ్రి గెలిచాడు!

Ramakishtaiah Wins Against Son in Telangana Panchayat Elections
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన ఫలితం వెలువడింది. సర్పంచి పదవి కోసం ఒకే కుటుంబం నుంచి తండ్రీకొడుకులు పోటీ పడగా, గ్రామస్థులు అనుభవానికే పట్టం కట్టారు. కుమారుడిపై తండ్రి ఘన విజయం సాధించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి మానెగల్ల రామకిష్టయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్ నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగింది. అయితే, ఓటర్లు మాత్రం తండ్రి రామకిష్టయ్య వైపే మొగ్గు చూపారు.
 
గ్రామంలో మొత్తం 1,985 ఓట్లు ఉండగా, రామకిష్టయ్యకు 684 ఓట్లు పోలయ్యాయి. ఆయన కుమారుడు వెంకటేశ్‌కు 585 ఓట్లు దక్కాయి. దీంతో 99 ఓట్ల మెజారిటీతో రామకిష్టయ్య గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ విజయంతో ఆయన మూడోసారి ఝాన్సీలింగాపూర్ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. సొంత కొడుకే ప్రత్యర్థిగా నిలిచినా, గ్రామస్థులు తనపై నమ్మకం ఉంచి గెలిపించడం సంతోషంగా ఉందని రామకిష్టయ్య తెలిపారు.
Go Back to Shorts
Ramakishtaiah
Telangana Panchayat Elections
Medak District
Jhansi Lingapur
Village Sarpanch
Father vs Son
Ramayampet
Venkatesh
Local Elections

More Telugu News