సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున రేవంత్ రెడ్డి, అపర్ణ టీమ్ తరఫున మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్
- ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మెస్సీ
- ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భారీ భద్రత
- ఫోక్ సాంగ్స్తో ఆకట్టుకున్న సిప్లిగంజ్, మంగ్లీ
ఫుట్బాల్ మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి, మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్ఆర్ తరఫున, మెస్సీ అపర్ణ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నారు.
కోల్కతా ఘటనతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతకుముందు స్టేడియంలో మ్యూజికల్ నైట్, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మంగ్లీ, సిప్లిగంజ్ తమ ఫోక్ సాంగ్స్తో అలరించారు.