Nara Lokesh: బాలా మామయ్య నట తాండవం చూడబోతున్నాం: మంత్రి నారా లోకేశ్
- రేపు అఖండ-2 రిలీజ్
- సోషల్ మీడియాలో స్పందించిన మంత్రి నారా లోకేశ్
- సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయం సాధించాలని ఆకాంక్ష
- ఐదు దశాబ్దాల చరిత్రలో మరో ఘనవిజయమన్న లోకేశ్
- చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న 'అఖండ 2' చిత్రం రేపు (డిసెంబరు 12) విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
"'అఖండ 2' సినిమాలో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
"ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న బాలా మామయ్యకు అభినందనలు" అంటూ బాలకృష్ణను కొనియాడారు. లోకేశ్ తన పోస్టులో '#Akhanda2Thaandavam', '#Akhanda2' అనే హ్యాష్ట్యాగ్లను కూడా జోడించారు. బాలకృష్ణ హీరోగా గతంలో వచ్చిన 'అఖండ' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
"'అఖండ 2' సినిమాలో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
"ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న బాలా మామయ్యకు అభినందనలు" అంటూ బాలకృష్ణను కొనియాడారు. లోకేశ్ తన పోస్టులో '#Akhanda2Thaandavam', '#Akhanda2' అనే హ్యాష్ట్యాగ్లను కూడా జోడించారు. బాలకృష్ణ హీరోగా గతంలో వచ్చిన 'అఖండ' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.