Akhanda 2: 'అఖండ-2' వివాదానికి శుభం కార్డు.. ఈ నెల 12న విడుదల!
- కొలిక్కి వచ్చిన అఖండ-2 విడుదల వివాదం
- నిర్మాణ సంస్థల మధ్య సానుకూలంగా ముగిసిన చర్చలు
- ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం
- మద్రాస్ హైకోర్టు అనుమతి తర్వాత అధికారిక ప్రకటన
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న 'అఖండ-2: తాండవం' సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. నిర్మాణ సంస్థల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ నెల 5న నిలిచిపోయిన ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
14 రీల్స్, ఈరోస్ సంస్థల మధ్య వున్న ఆర్ధిక వివాదం కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, సోమవారం రాత్రి ఈ రెండు సంస్థల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాలు ఒక అంగీకారానికి రావడంతో వివాదం ముగిసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఈరోజు ఉదయం 10:30 గంటలకు మద్రాస్ హైకోర్టుకు నివేదించి, సినిమా విడుదలకు అధికారిక అనుమతులు తీసుకోనున్నారు.
వివాదం సద్దుమణగడంతో 'అఖండ-2' చిత్రాన్ని ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒకరోజు ముందుగా అంటే ఈ నెల 11న ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం కూడా ఉందని సమాచారం. న్యాయస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే సినిమా ప్రమోషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇది బాలయ్య అభిమానులకు నిజంగా గుడ్న్యూస్ అనే చెప్పాలి.
14 రీల్స్, ఈరోస్ సంస్థల మధ్య వున్న ఆర్ధిక వివాదం కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, సోమవారం రాత్రి ఈ రెండు సంస్థల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాలు ఒక అంగీకారానికి రావడంతో వివాదం ముగిసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఈరోజు ఉదయం 10:30 గంటలకు మద్రాస్ హైకోర్టుకు నివేదించి, సినిమా విడుదలకు అధికారిక అనుమతులు తీసుకోనున్నారు.
వివాదం సద్దుమణగడంతో 'అఖండ-2' చిత్రాన్ని ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒకరోజు ముందుగా అంటే ఈ నెల 11న ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం కూడా ఉందని సమాచారం. న్యాయస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే సినిమా ప్రమోషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇది బాలయ్య అభిమానులకు నిజంగా గుడ్న్యూస్ అనే చెప్పాలి.