కేకేఆర్కు రసెల్ గుడ్ బై వెనుక షారుఖ్ ఖాన్!
- ఐపీఎల్కు వీడ్కోలు పలికిన ఆండ్రీ రసెల్
- కేకేఆర్ పవర్ కోచ్గా కొత్త బాధ్యతలు
- వేలం పర్సులో రూ.18 కోట్లు ఆదా చేసేందుకే విడుదల నిర్ణయం
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ ఆల్-రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ కేకేఆర్తో తన బంధాన్ని కొనసాగించనున్నాడు. ఫ్రాంచైజీ అతడిని తమ జట్టుకు ‘పవర్ కోచ్’గా నియమించింది. రాబోయే వేలానికి ముందు రసెల్ను విడుదల చేయడంపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వివరించారు.
రసెల్ను విడుదల చేయడం వెనుక ప్రధాన కారణం ఆర్థికపరమైన వ్యూహమేనని వెంకీ మైసూర్ స్పష్టం చేశారు. రసెల్ కాంట్రాక్ట్ విలువ రూ. 12 కోట్లు అయినప్పటికీ, నిబంధనల ప్రకారం అతడిని అట్టిపెట్టుకుంటే తమ వేలం పర్సు నుంచి రూ. 18 కోట్లు తగ్గుతాయని తెలిపారు. "వేలంలో రూ. 18 కోట్లు చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో జట్టును మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. అదే రూ. 12 కోట్లు అయితే మా నిర్ణయం బహుశా మరోలా ఉండేది" అని ఆయన పేర్కొన్నారు.
ఈ నిర్ణయం గురించి తెలిశాక రసెల్ చాలా భావోద్వేగానికి గురయ్యాడని, కొన్ని రాత్రులు నిద్ర కూడా పట్టలేదని చెప్పాడని మైసూర్ అన్నారు. రిటైర్మెంట్ గురించి రసెల్ ఆలోచిస్తున్న విషయాన్ని జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్తో పంచుకున్నప్పుడు, అతడే ఈ సూచన చేసినట్లు వెల్లడించారు. ఆటగాడిగా కెరీర్ ముగిశాక భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం సరైందని షారుఖ్ భావించారని తెలిపారు. పవర్ హిట్టింగ్, డెత్ బౌలింగ్, ఫీల్డింగ్లో రసెల్ నైపుణ్యాలను గౌరవిస్తూ 'పవర్ కోచ్' పాత్రను సృష్టించామని, ఈ కొత్త బాధ్యత పట్ల రసెల్ కూడా సంతోషంగా ఉన్నాడని మైసూర్ వివరించారు.
2014 నుంచి కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్, తన ఐపీఎల్ కెరీర్లో 140 మ్యాచ్లు ఆడి 2,651 పరుగులు, 123 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
రసెల్ను విడుదల చేయడం వెనుక ప్రధాన కారణం ఆర్థికపరమైన వ్యూహమేనని వెంకీ మైసూర్ స్పష్టం చేశారు. రసెల్ కాంట్రాక్ట్ విలువ రూ. 12 కోట్లు అయినప్పటికీ, నిబంధనల ప్రకారం అతడిని అట్టిపెట్టుకుంటే తమ వేలం పర్సు నుంచి రూ. 18 కోట్లు తగ్గుతాయని తెలిపారు. "వేలంలో రూ. 18 కోట్లు చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో జట్టును మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. అదే రూ. 12 కోట్లు అయితే మా నిర్ణయం బహుశా మరోలా ఉండేది" అని ఆయన పేర్కొన్నారు.
ఈ నిర్ణయం గురించి తెలిశాక రసెల్ చాలా భావోద్వేగానికి గురయ్యాడని, కొన్ని రాత్రులు నిద్ర కూడా పట్టలేదని చెప్పాడని మైసూర్ అన్నారు. రిటైర్మెంట్ గురించి రసెల్ ఆలోచిస్తున్న విషయాన్ని జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్తో పంచుకున్నప్పుడు, అతడే ఈ సూచన చేసినట్లు వెల్లడించారు. ఆటగాడిగా కెరీర్ ముగిశాక భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం సరైందని షారుఖ్ భావించారని తెలిపారు. పవర్ హిట్టింగ్, డెత్ బౌలింగ్, ఫీల్డింగ్లో రసెల్ నైపుణ్యాలను గౌరవిస్తూ 'పవర్ కోచ్' పాత్రను సృష్టించామని, ఈ కొత్త బాధ్యత పట్ల రసెల్ కూడా సంతోషంగా ఉన్నాడని మైసూర్ వివరించారు.
2014 నుంచి కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్, తన ఐపీఎల్ కెరీర్లో 140 మ్యాచ్లు ఆడి 2,651 పరుగులు, 123 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.