కాలి గాయంపై స్పందించిన శ్రద్ధా కపూర్.. ఫ్యాన్స్‌కు హెల్త్ అప్‌డేట్

  • 'ఈఠా' సినిమా షూటింగ్‌లో గాయపడిన శ్రద్ధా కపూర్
  • కాలి కండరానికి గాయమై, కొద్దిగా ఫ్రాక్చర్ అయినట్లు వెల్లడి
  • వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇటీవల 'ఈఠా' సినిమా షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. తన కాలి గాయంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఆమె తాజాగా తన ఆరోగ్యంపై స్పష్టత నిచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు.

సోషల్ మీడియాలో ఒక అభిమాని తన గాయం గురించి అడగ్గా, శ్రద్ధా స్పందించారు. "ఇది పెద్ద దెబ్బేమీ కాదు. కాలి కండరానికి గాయమై, కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. నేను క్షేమంగానే ఉన్నాను. త్వరలోనే మీ ముందుకు వస్తాను" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ అప్‌డేట్‌తో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

లక్ష్మణ్ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఈఠా' సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల నాసిక్‌లోని ఓ భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుతుండగా, బరువైన కాస్ట్యూమ్స్ ధరించి డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమె ఎడమ కాలికి గాయమైంది. దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, ఈ సినిమాలోని పాత్ర కోసం శ్రద్ధా కపూర్ ఏకంగా 15 కిలోల బరువు పెరిగినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం గమనార్హం.


More Telugu News