మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రభాస్ 'స్పిరిట్' ప్రారంభం

  • సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ సినిమా
  • ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టిన చిరంజీవి
  • హాజరైన హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాతలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం 'స్పిరిట్' లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై, ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాతలు భూషణ్ కుమార్, వంగా ప్రణయ్, శివ తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, వంగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.


More Telugu News