మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కు మాతృవియోగం... జగన్ సంతాపం
- మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కుటుంబంలో విషాదం
- ఆయన తల్లి సాకే గంగమ్మ కన్నుమూత
- శింగనమల వైసీపీ ఇంఛార్జ్గా శైలజానాథ్
- కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన వైఎస్ జగన్
వైసీపీ నేత, శింగనమల నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సాకే గంగమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.
శైలజానాథ్ తల్లి మరణం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శైలజానాథ్కు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "శైలజానాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని జగన్ పేర్కొన్నారు. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా శైలజానాథ్ కుటుంబానికి సంతాప సందేశాలు పంపుతున్నారు.
శైలజానాథ్ తల్లి మరణం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శైలజానాథ్కు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "శైలజానాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని జగన్ పేర్కొన్నారు. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా శైలజానాథ్ కుటుంబానికి సంతాప సందేశాలు పంపుతున్నారు.